నిఖిల్ సిధార్థ్ ఫుల్ ఫాం లోకి వచ్చేశాడు. ఏడాది కాలంగా సతమతమైనా నిఖిల్ కు ఎట్టకేలకు ఒక హిట్ దక్కింది. కోర్టు తీర్పులాగా వాయిదాల మీద వాయిదాలు పడుతు వచ్చిన అర్జున్ సురవరం ఎట్టకేలకు గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆశలు అరచేతిలో పెట్టుకొని నిఖిల్ కి మళ్ళీ కాస్త కాన్‌ఫిడెన్స్ ఇచ్చింది అర్జున్ సురవరం. దాంతో వచ్చే ఏడాది కనీసం 2 సినిమాలు రిలీజ్ చేస్తానని, వీలైతే 3 సినిమాలు కూడా రావొచ్చంటూ రీసెంట్ గా ప్రకటించాడు నిఖిల్. చెప్పినట్టుగానే ఇప్పుడు స్పీడ్ పెంచాడు. కార్తికేయ-2 సినిమాకు ఇప్పటికే కాల్షీట్లు కేటాయించిన ఈ యంగ్ హీరో, ఇప్పుడు గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై మరో సినిమా చేయబోతున్నాడు.

 

గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై బన్నీ వాస్ నిర్మాతగా సూర్యప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా చేయబోయే సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు స్పెషల్ ఎట్రాక్షన్ గా సుకుమార్ నిలిచాడు. అవును.. సుకుమార్ ఈ సినిమాకు కథ అందించడమే కాకుండా, స్క్రీన్ ప్లే కూడా సమకూరుస్తుండటం విశేషం. అంతేకాదు కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నందుకు సుకుమార్ ఏమాత్రం రెమ్యూనరేషన్ తీసుకోకపోవడం ఆసక్తికరమైన విషయం. అయితే ఒకవేళ సినిమా గనక హిట్టయితే మాత్రం సినిమాలో షేర్ తీసుకుంటున్నాడు. అంతేకాదు ఈ సినిమాకు సహ-నిర్మాతగా కూడా వ్యవహరించబోతున్నాడు. అల్లు అరవింద్ ఎప్పట్లానే సమర్పకుడిగా వ్యవహరిస్తారని తాజా సమాచారం.

 

మొత్తానికి సుకుమార్ తో సినిమా చేయాలనే కోరికను నిఖిల్ ఇలా నెరవేర్చుకుంటున్నాడు. వాస్తవంగా రాజ్ తరుణ్ తో వచ్చిన కుమారి 21 ఎఫ్ ని నిఖిల్ తో చేయాలనుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఎందుకనో ఆ సినిమా రాజ్ తరుణ్ కి వెళ్ళింది. ఇక కార్తికేయ-2 ఓ షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే, సూర్యప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ సినిమా సెట్స్ పైకి వెళుతుందని లేటెస్ట్ అప్‌డేట్. అంతేకాదు ఈ సినిమా అయిన వెంటనే 'హనుమంతు' అనే మరో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ప్రాజెక్టును కూడా స్టార్ట్ చేయబోతున్నాడు నిఖిల్. ఏదేమైనా నిఖిల్ స్పీడ్ కి ఇక ఇప్పట్లో బ్రేకులు పడే ఛాన్సే లేదనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: