బయోపిక్ ల హవా అన్ని నడుస్తున్న విషయం తెలిసిందే. ఆయన సినీ రాజకీయ ప్రముఖుల బయోపిక్ లను తెరకెక్కిస్తు భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నారు. కొన్ని బయోపిక్లో విజయాన్ని సొంతం చేసుకుంటే ఇంకొన్ని బయోపిక్ లు మాత్రం డిజాస్టర్గా కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం భారీ అంచనాల మధ్య నిర్మించబడుతున్న బయోపిక్ జయలలిత బయోపిక్. ఒకప్పుడు సినిమాల్లో తన హవా నడిపించి ఆ తర్వాత రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసి తమిళ ప్రజల తలైవిగా మారిపోయిన జయలలిత బయోపిక్ ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు. అయితే జయలలిత బయోపిక్ లను రెండు మూడు వస్తున్నప్పటికీ వాటిలో ఎక్కువ క్రేజ్ ఇమేజ్ సంపాదించుకున్న బయోపిక్ మాత్రం తలైవి . అన్నింటిలోనూ భారీ అంచనాలు నెలకొన్న బయోపిక్ ఇదొక్కటే. అయితే అమ్మ చనిపోయిన తర్వాత మూడేళ్ళకి ఈ బయోపిక్ తెరకెక్కిస్తున్నారు దర్శకులు. అయితే ఈ సినిమాలో కంగనారనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. సినిమాని ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్నారు.
అయితే ఎన్టీఆర్ బయోపిక్ ని తెరకెక్కించిన విష్ణు ఇందూరి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే జయలలిత పేరు తీయగానే అందరికీ గుర్తు వచ్చే పేర్లు రెండే రెండు ఒకటి ఎంజిఆర్, రెండు కరుణానిధి. అయితే జయలలిత జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటనలన్నింటినీ ప్రోగుచేసి.. అమ్మ కు నివాళి గా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. జయలలిత జీవితంలో అత్యంత కీలక పాత్ర పోషించింది ఎంజీఆర్. కాగా ఆయన పాత్రలో అరవిందస్వామి నటిస్తున్నారు. అయితే ఇప్పటికే తమిళ తల్లి అమ్మ జయలలితకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలై సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
అయితే జయలలిత వ్యక్తిగత జీవితంలో మరో ప్రధాన పాత్రధారులు శోభన్ బాబు. శోభన్ బాబు జయలలిత కు ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని విశ్లేషకులు చెబుతున్న మాట. జయలలిత బయోపిక్ లో శోభన్ బాబు లేకుండా ఉంటే... ఆ సినిమా ఉప్పులేని పప్పుచారు లాంటిదే అవుతుంది అంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే జయలలిత బయోపిక్ లో శోభన్ బాబు పాత్రలో ఎవరు నటించబోతున్నారు అనేది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు దీనికి సమాధానం వచ్చేసినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ సెన్సేషనల్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ అలనాటి శోభన్ బాబు పాత్రలో నటించనున్నాడని వార్తలు కూడా వస్తున్నాయి. ఒకవేళ అదే కుదిరితే శోభన్ బాబు పాత్రలో విజయ్ దేవరకొండ నటించబోతున్నట్లు తెలుస్తోంది.