మహేష్ బాబు ' సరిలేరు నీకెవ్వరు ' చిత్రంలో ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించబోనున్నారు, ఈ చిత్రం యొక్క మొదటి టీజర్ విడుదలైనప్పటి నుండి మహేష్ బాబు అభిమానులు చిత్ర విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ఆర్మీ పాత్ర లో కనిపించబోనున్న మహేష్ బాబు చిత్రం ' సరిలేరు నీకెవ్వరు ' టీజర్కు దేశవ్యాప్తంగా ఉన్న అతని అభిమానుల నుండి మంచి స్పందన లభించింది. టాలీవుడ్ మరియు బాలీవుడ్ మధ్య వున్నా సరిహద్దులు నెమ్మదిగా చెరిగి పోతున్నాయి. సాహో మరియు కెజిఎఫ్ వంటి చిత్రాలు దీనికి నిదర్శనం.
సరిలేరు నీకెవ్వరు టీజర్ విడుదలైనప్పటి నుండి, దీనికి అద్భుతమైన స్పందన లభించింది. చిత్ర నిర్మాతలు ఉత్తర మరియు బాలీవుడ్ పంపిణీదారుల నుండి కాల్స్ అందుకున్నట్లు సమాచారం. పంపిణీదారులు ఈ చిత్రాన్ని హిందీలో కూడా విడుదల చేయాలని పట్టుబట్టారు. ఈ చిత్రం బహు భాష రైట్స్ ను కలిగి ఉంది. అన్ని అనుకున్నా విదంగా జరిగితే మహేష్ బాబు యొక్క బాలీవుడ్ అరంగేట్రం ఖాయం.
తన 25 వ చిత్రం మహర్షి విజయవంతం అయిన తరువాత, మహేష్ బాబు తన రాబోయే చిత్రం సరిలేరు నీకెవ్వరు తో అభిమానులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రం లో ఆర్మీ పాత్రలో మహేష్ దేశ భక్తి భావాలను రేకెత్తించనున్నాడు మరియు డైలాగ్ డెలివరీ, నటన తో ప్రేక్షకులను మెప్పించనున్నాడు. భారతదేశం అంతటా వివిధ ప్రదేశాల్లో చిత్రీకరించిన ఈ హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్లో మహేష్ బాబు దేశ శత్రువులను మట్టు కరిపించనున్నారు. ఈ చిత్ర యాక్షన్ ప్యాక్డ్ టీజర్ భారతదేశం అంతటా తరంగాలను సృష్టిస్తోంది.
ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరీలేరు నీకెవ్వరు చిత్రాన్ని అనిల్ రవిపుడి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సంక్రాంతి 2020 లో విడుదల కానుంది. ఎకె ఎంటర్టైన్మెంట్స్ మరియు జిఎంబి ఎంటర్టైన్మెంట్ వారి బ్యానర్లో అనిలే సుంకర, దిల్ రాజు మరియు మహేష్ బాబు సంయుక్తంగా ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించారు.