దివంగత నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, సినీ నటి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా తలైవి.. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథా కథనాలు అందిస్తుండగా. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కీలక పాత్రల కనిపించనున్నాడట.
ఇకపోతే జయలలిత బయోపిక్ అంటే అందరికీ గుర్తొచ్చే పేర్లు రెండు.. ఒకటి ఎంజీఆర్.. మరోటి కరుణానిధి. ఈమె జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటలన్నీ పోగేసి.. అమ్మకు నివాళిగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామంటూ విజయ్ ఇప్పటికే ప్రకటించాడు. అమ్మ జీవితంలో అత్యంత కీలక పాత్ర పోషించింది ఎంజీఆర్. ఈయన పాత్రలో అరవింద్ స్వామి నటిస్తున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ కూడా వచ్చేసింది. ఇక కరుణానిధిగా ప్రముఖ నటుడు కనిపిస్తున్నాడని తెలుస్తుంది.
జయ కుటుంబం నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతే బయోపిక్ మొదలుపెట్టాడు విజయ్. ఇక సెన్సేషనల్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే మూడు సినిమాలను లైన్లో పెట్టినట్లు సమాచారం. ఇకపోతే తెలుగు హీరో శోభన్బాబు, జయలలిత జీవితంలో కీలక పాత్ర పొషించాడు అని చెప్పుకొంటారు.. ఒకప్పుడు వీరిద్దరి మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉండేందట. అంతేకాదు వీరు పెళ్లి చేసుకోబోతున్నారన్న ప్రచారం కూడా అప్పట్లో చాలా గట్టిగానే జరిగిందట.
అయితే తరువాత కుటుంబ సమస్యల కారణంగా ఇద్దరు దూరమయ్యారని చెబుతారు. ఇకపోతే ఇప్పుడు జయలలిత బయోపిక్లో విజయ్ దేవరకొండ శోభన్బాబు పాత్రలో నటిస్తున్నాడు. ఇది ఆయన ప్రేక్షకులకు చిన్న ట్విస్ట్ లాంటిదే ఈ విషయం కోస.. ఇక హీరో విజయ్ దేవరకొండను శోభన్ బాబు పాత్ర కోసం అడిగారని తెలుస్తుంది. దీనికి ఆయన కూడా ఓకే అన్నట్లు ప్రచారం జరుగుతుంది. శోభన్ బాబు, జయలలిత మధ్య బంధాన్ని ఇప్పుడు విజయ్ ఎలా చూపిస్తాడనేది ఆసక్తి కరంగా మారురింది. ఒకవేళ అన్నీ కుదిరి శోభన్ బాబుగా విజయ్ దేవరకొండ కనిపిస్తే మాత్రం సంచలనమే...