తమిళ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ అసురన్ ఇటీవల విడుదలై కోలీవుడ్ లో బ్లాక్ బాస్టర్ విజయాన్ని నమోదు చేసింది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో రివెంజ్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రానికి యూనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం తెలుగులో రీమేక్ కానుంది. అయితే ఇటీవల ఈ
రీమేక్ లో హీరోగా రకరకాల పేర్లు వినిపించాయి. కానీ చివరి కి సీనియర్ హీరో వెంకటేశ్ హీరోగా ఫైనల్ అయ్యాడు. దాంతో చాలా మంది ఆశ్ఛర్యం వ్యక్తం చేశారు.
ధనుష్ చేసిన పాత్ర వెంకీకి సెట్ అవుతుందా అని అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
అయితే వెంకటేశ్ మాత్రం కేవలం 30 నిమిషాల్లో ఈ కథను ఓకే చేశానని ఇంతకుముందు ఎప్పుడూ నేను ఇలాంటి పాత్ర చేయలేదు. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందాని ఎదురుచూస్తున్నానని వెంకీ మామ ప్రమోషన్స్ లో అన్నారు. కుటుంభ కథా చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ అసురన్ రీమేక్ ను డైరెక్ట్ చేయనుండగా ఒరిజినల్ వెర్షన్ నిర్మాత కలైపులి ఎస్ థాను తోకలిసి సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.
ఇదిలా ఉంటే వెంకటేశ్ నటించిన లేటెస్ట్ మూవీ వెంకీ మామ ఈ నెల 13న విడుదలకానుంది. మల్టీ స్టారర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో నాగ చైతన్య మరో హీరోగా నటించగా రాశి ఖన్నా , పాయల్ రాజ్ పుత్ కథానాయికలుగా నటించారు. ఈచిత్రం పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు వున్నాయి. జై లవకుశ ఫేమ్ బేబీ డైరెక్ట్ చేసిన ఈచిత్రం పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు వున్నాయి. ఇక ఈఏడాది ప్రారంభం లో ఎఫ్ 2 తో వెంకీ భారీ హిట్టు కొట్టగా మజిలీ, చైతన్య పరాజయాలకు బ్రేక్ వేసింది. మరి ఇప్పుడు వెంకి మామ వీరిద్దరికి మరో విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.