టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం దక్షిణాది సినిమా రంగంలో వివిధ భాషల్లో సినిమాలు చేస్తూ కెరియర్ ని కంటిన్యూ చేస్తోంది. అప్పట్లో కేవలం తెలుగు సినిమా రంగంలోనే సినిమాలు చేస్తూ అదిరిపోయే హిట్ సినిమాలతో స్టార్ హీరోలందరి పక్కన నటించిన కాజల్ అగర్వాల్ కొంతకాలానికి బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిలై పోదాం అని భావించి సౌత్ ఇండస్ట్రీ లో వచ్చిన సినిమా అవకాశాలను వదులుకొని బాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తూ వరుస పరాజయాలు నమోదు చేసుకుంది. చేసిన ప్రతి సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో ఇండస్ట్రీలో రోజు రోజుకి కాజల్ అగర్వాల్ పై పెద్దగా ఫోకస్ ఎవరికి లేకపోవడంతో తిరిగి తనకు లైఫ్ ఇచ్చిన సౌత్ వైపు ప్రయాణం మొదలుపెట్టి మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఖైదీ నెంబర్ 150' సినిమాలో హీరోయిన్ గా చేసి అదిరిపోయే హిట్ అందుకున్న తర్వాత వరుస ఆఫర్లు దక్కించుకుంది.

 

ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కాజల్ అగర్వాల్ మరియు ప్రభాస్ కలిసి నటించిన అన్ని సినిమాలు అదిరిపోయే హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో తాజాగా వీరిద్దరు కలిసి మరో సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో 'జాన్' అనే సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. పునర్జన్మల నేపథ్యంలో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఆ మధ్య ఇటలీలో కొంతవరకూ షూటింగ్ చేసుకుని వచ్చారు.

 

తదుపరి షెడ్యూల్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేశారు. యూరప్ నేపథ్యానికి సంబంధించిన సెట్స్ ను సిద్ధం చేస్తున్నారు. ఈ సెట్స్ సిద్ధం కాగానే మేజర్ పార్ట్ షూటింగ్ అక్కడే జరగనుంది. 1970 పీరియాడికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అతిథి పాత్రలో కాజల్ కనిపించనుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. వస్తున్న వార్తల్లో వాస్తవం ఎంత ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంది . 

మరింత సమాచారం తెలుసుకోండి: