ఇటీవల తెలుగు సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ విషయమై నానా రచ్చ చేసి పలు సంచలనాలకు తెరతీసిన వర్ధమాన నటి శ్రీరెడ్డి ఉదంతం అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపింది. తనవంటి ఎందరో ఆడపిల్లలను కొందరు సినిమా ఇండస్ట్రీకి చెందిన మేనేజర్లు మరియు కోఆర్డినేటర్లు అవకాశాల పేరుతో లైంగికంగా లొంగదీసుకుంటున్నారని, తమ కోరికలు తీరిస్తేనే కానీ అవకాశాలు ఇవ్వం అని బెదిరిస్తున్నారని శ్రీరెడ్డి మా అసోసియేషన్ ముందు బైఠాయించింది. ఆ తరువాత వారు దిగిరాకపోవడంతో అర్ధ నగ్న ప్రదర్శన కూడా చేసింది. అనంతరం ఆ ఘటనతో  శ్రీరెడ్డి పేరు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మారు మ్రోగింది. 

 

ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి ఆయన ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన శ్రీరెడ్డి, కొన్నాళ్ల నుండి తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కొందరు సినిమా నటులను టార్గెట్ చేస్తూనే ఉంది. ఇకపోతే నిన్న మెగాబ్రదర్ నాగబాబుని ఉద్దేశించి ఆమె పెట్టిన ఒక పోస్ట్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో పెను సంచలనం రేపుతోంది. విషయం ఏమిటంటే, ఇటీవల జబర్దస్త్ నుండి నాగబాబు బయటకు రావడంతోపాటు, మల్లెమాల సంస్థలోని కొందరు సభ్యులు, షోలో పార్టిసిపెంట్స్ పట్ల నిబద్దతతో వ్యవహరించడం లేదని, అది నచ్చకనే తాను బయటకు వచ్చినట్లు చెప్పారు. అయితే ఈ ఘటనపై శ్రీరెడ్డి విరుచుకుపడింది. జబర్దస్త్ కు ముందు నువ్వు ఎవరు, ఇప్పుడు నువ్వు ఎవరు. 

 

ఇన్నాళ్లు ఈటివి మరియు మల్లెమాల వారి డబ్బులు తిన్నావు, తీరా బయటకు వచ్చిన తరువాత మల్లెమాల వారిపై నిందలు వేస్తున్నావు అంటూ విమర్శించింది. నిజానికి నీలాంటి పాము వంటి వ్యక్తికి వాళ్ళు పలు పోసి పెంచారని, అసలు వాస్తవం మాట్లాడాలంటే, మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి చెప్పు నీ పూజగదిలో పెట్టుకుని డైలీ నువ్వు పూజ చేయాలని శ్రీరెడ్డి పోస్ట్ చేసింది. కాగా శ్రీరెడ్డి చేసిన ఆ పోస్ట్ పై మెగా ఫ్యాన్స్ ఆగ్రహంతో ఆమెపై కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ఘటన రాబోయే రోజుల్లో ఎటువంటి వివాదాలకు దారి తీస్తుందో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: