బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ స్కూల్‌లో ఉన్నప్పుడు ఈవ్ టీజింగ్ సంఘటన ఎదుర్కొన్నారట. ఈ విషయాన్ని రీసెంట్‌గా బయటపెట్టారు. కంగన చండీఘడ్‌లో చదువుకున్న సంగతి తెలిసిందే. సినిమాల మీద ఆసక్తితో మోడలింగ్ రంగంలో అడుగు పెట్టాలని ముంబాయ్ లో అడుగు పెట్టింది. ఇక కంగన స్కూల్‌కి వెళ్లే రోజుల్లో అబ్బాయిలు బైక్‌లపై వచ్చి ఆడపిల్లలను ఎక్కడపడితే అక్కడ టచ్ చేసేవారట. ఓ బైకర్ తన దగ్గరికి వేగంగా వచ్చి వక్షోజాలపై గట్టిగా కొట్టాడట. దెబ్బ గట్టిగా తగలడంతో కంగన కళ్లు తిరిగి పడిపోయారు. దాదాపు ఐదు నిమిషాల వరకు స్పృహలోకి రాలేదట. స్పృహ వచ్చాక ఈ ఘటనను ఎవరూ చూడలేదు కదా అనుకుంటూ ఇంటికి వెళ్లిపోయానని వాపోయింది. 

 

ఎలాంటి విషయాలపైనైనా బోల్డ్ కామెంట్స్ చేయడం కంగనకు కొత్తేమీ కాదన్న విషయం తెలిసిందే.  చిన్నప్పుడు తనకు అలాంటి చెప్పుకోలేని ఘటన ఎదురైతే ఎవరైనా చూసుంటారేమోనని భయపడ్డానని, కానీ ఇప్పుడు అలాంటి ఆలోచన వచ్చినా కూడా నరికి పారేసే ధైర్యం ఉందని అన్నారు. ప్రస్తుతం చాలామంది హీరోయిన్స్ ధైర్యంగా మాట్లాడటంలో కంగన రోల్ మోడల్‌గా నిలుస్తున్నారు. అక్కినేని కోడలు సమంతకు కూడా కంగన అంటే చాలా ఇష్టం. కంగనలా మాట్లాడే ధైర్యం తమకు కూడా ఉంటే ఎంతో బాగుండు.. అని చాలా మంది హీరోయిన్స్ సందర్భం వచ్చినప్పుడల్ల అంటుంటారు. 

 

ఇక ప్రస్తుతం కంగన 'తలైవి' బయోపిక్‌తో బిజీగా ఉన్నారు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ధారంగా ఈ సినిమాను ఏ ఎల్ విజయ్ తెరకెక్కిస్తున్నాడు. తెలుగు, తమిళంలో భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్ వైరల్ అయింది. జయలలితలా కాస్త లావుగా కనిపించడానికి కంగన కొన్ని స్టెరాయిడ్స్ వాడాల్సి వచ్చిందని తెలిపారు. ఇక ఈ సినిమాతో పాటు ఆమె 'పంగా', 'ధాకడ్' సినిమాల్లోనూ నటిస్తున్నారు. అంతేకాదు మణికర్ణిక ఫిలింస్ పేరుతో నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించారు. అయోధ్య కేసుపై తొలి సినిమాను తీసి సంచలనం సృష్ఠించబోతున్నారు కంగన. 

మరింత సమాచారం తెలుసుకోండి: