శర్వానంద్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "శతమానం భవతి". దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాదు జాతీయ స్థాయిలో  ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కూడా ఎంపికైంది. అయితే ప్రస్తుతం ఈ సినిమాలాగే మరో సినిమా రాబోతుంది. సాయి ధరమ్ తేజ్ హిరోగా మారుతి దర్శకత్వమ్లో తెరకెక్కిన "ప్రతిరోజూ పండగే" సినిమా శతమానం భవతి సినిమా లాంటిదే..

 

నిజానికి శతమానం భవతి సినిమాని సాయి ధర్మ్ తేజ్ చేయాల్సిందట. సాయి ధరమ్‌ తేజ్‌ అప్పట్లో ఒక ఫ్యామిలీ డ్రామా చేద్దామని చూసేవాడు. అప్పుడే అతనికి హరీష్‌ శంకర్‌ వద్ద రచనా విభాగంలో పని చేస్తోన్న సతీష్‌ వేగేశ్న 'శతమానం భవతి' కథ చెబితే, దానిని దిల్‌ రాజుకి తేజ్‌ రిఫర్‌ చేసాడు. తీరా పంపించిన హీరోని పక్కనపెట్టి ఆ కథని శర్వానంద్‌తో చేసేసారు.  అయితే అప్పుడు మిస్ అయిన ఆ సినిమా ఇప్పుడు ప్రతి రొజూ పండగే రూపంలో మన ముందుకు రాబోతుంది.

 

సినిమా ట్రైలర్ నిన్ననే విడుదల అయింది. ట్రైలర్ ని చూసిన ప్రతీ ఒక్కరూ ఇది శతమానం భవతిని పోలి ఉందని చెప్తారు. శతమానం భవతి సినిమాలో ప్రకాష్ రాజ్ చేసిన పాత్రలో ఈ సినిమాలీ సత్యరాజ్ కనిపిస్తున్నాడు. సాయి దరమ్ తేజ్ ఫ్యామిలీ డ్రామా సినిమాని శతమానం భవతి లాగా చేద్దామని మారుతి అనుకునే ఈ సినిమా స్క్రిప్టు రాసుకున్నాడట. మరి కొద్ది రోజుల్లో మారుతి శతమానం భవతి థియేటర్లలోకి రానుంది.

 

అయితే ఆ పోలికని జనాలు గుర్తిస్తారని ముందే గుర్తించిన మారుతి ట్రైలర్ లో ఆ సినిమా గురించి ప్రస్తావించాడు. దానివల్ల అతని మీద విమర్శలు తగ్గుతాయని అనుకుని ఉంటాడు. మరి ప్రతి రోజూ పండగే సినిమా మరో శతమానం భవతి లాగా అలరిస్తుందా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: