శోభన్ బాబు చనిపోయి సంవత్సరాలు గడిచిపోయినా ఆయన నటించిన సినిమాలను ఇష్టపడే జనం ఇప్పటికీ ఉన్నారు. దీనితో ఆయన ఇమేజ్ మరణానంతరం కూడ కొనసాగుతోంది. ఇప్పుడు విజయ్ దేవరకొండకు అనుకోకుండా శోభన్ బాబు మరొకసారి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకు రావడానికి సహాయ పడుతున్నాడు. 

జయలలిత జీవితం ఆధారంగా కంగనా రనౌత్ నటిస్తున్న జయలలిత బయోపిక్ ‘తలైవి’ మూవీలో ఆమె వ్యక్తిగత జీవితంలో కీలక పాత్రను పోషించిన శోభన్ బాబు పాత్రను ఇప్పుడు విజయ్ దేవరకొండ చేత నటింప చేయబోతున్నట్లు టాక్. వాస్తవానికి జయలలిత శోభన్ బాబుల సాన్నిహిత్యం పై ఎన్నో రూమర్స్ ఉండటంతో జయలలిత బయోపిక్ శోభన్ బాబు పాత్ర లేకుండా పూర్తికాదు. ఈ సినిమాలో జయలలిత పాత్రలో నటిస్తున్న కంగనా రనౌత్ జయలలితగా కనిపించడానికి ఆమె మేకప్ కోసం ప్రతిరోజు నాలుగు గంటలు కష్టపడుతోంది అంటీ ఈ పాత్ర కోసం ఆమె పడుతున్న కష్టం అర్ధం అవుతుంది.

ఈ నేపధ్యంలో ఈసినిమాలోని కీలకమైన శోభన్ బాబు పాత్రకు విజయ్ దేవరకొండను ఒప్పించడానికి ఈమూవీ నిర్మాతలు భారీ పారితోషికాన్ని ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ‘నోటా’ ‘డియర్ కామ్రేడ్’ మూవీలతో విజయ్ తమిళ ప్రేక్షకులలో తన ఇమేజ్ పెంచుకోవడానికి చాల ప్రయత్నాలు చేసాడు. 

అయితే ఇప్పుడు తిరిగి తమిళ ప్రేక్షకులకు దగ్గర అయ్యే అవకాశం శోభన్ బాబు పాత్ర ద్వారా ఏర్పడుతోంది. ఈ మూవీని తమిళ కన్నడ తెలుగు హిందీ భాషలలో విడుదల చేయబోతున్న నేపధ్యంలో జాతీయ స్థాయిలో జయలలితకు ఉన్న ఇమేజ్ రీత్యా విజయ్ దేవరకొండ పాత్రకు కూడ చాల గుర్తింపు వచ్చే ఆస్కారం ఏర్పడి మళ్ళీ జాతీయ మీడియా దృష్టిని విజయ్ దేవరకొండ ఆకర్షించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత కొంత కాలంగా విజయ్ దేవరకొండకు తమిళ మార్కెట్ పై అదేవిధంగా బాలీవుడ్ పై చాల ఆసక్తి ఉంది. ఇప్పుడు ఆ కోరికను తీర్చు కోవడానికి శోభన్ బాబు సహకరిస్తున్నాడు అనుకోవాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: