టాలీవుడ్ లోకి బాలనటిగా పరిచయం అయిన మీనా ‘సీతారామయ్య మనవరాలు’ మూవీతో హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, మళియాళ టాప్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయింది. స్టార్ హీరోలందరి సరసన నటించి సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసింది. పెళ్లితో కాస్త గ్యాప్ తీసుకున్నా.. కొన్నాళ్ల తర్వాత మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. తనకి తగిన పాత్రల్ని ఎంచుకుంటూ అడపా దడపా తెరపై మెరుస్తోంది. ఆ మద్య సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన ‘ముత్తు’ సినిమాలో నటించింది. తాజాగా రజనీ, మీనా మరోసారి వెండితెరపై సందడి చేయనున్నారని కోలీవుడ్లో టాక్.
రజనీ 168వ మూవీ దర్శకుడు శివ తెరకెక్కించబోతున్నాడనే విషయం తెలిసిందే. రజనీకాంత్ హీరోగా చేయబోతున్న ఫ్యామిలీ డ్రామాలో మీనా విలన్ గా నటించనుందట. మీనా బాలనటిగా ఉన్న సమయంలో రజనీ హీరోగా నటించిన 'అన్బుళ్ల కేట్ట కురళ్' మూవీలో ఆయనకు కుమార్తెగా మీనా కనిపించింది. ఇప్పటికే ఆయన చిత్రీకరణకు సంబంధించిన విశేషాలతోపాటు, నటీనటులకు సంబంధించిన విశేషాలపై ఇతర చిత్రబృందంతో చర్చలు జరుపుతున్నారట. ఈ సినిమాలో రజనీకాంత్ భార్యగా ఖుష్బూ, ఆయన కుమార్తెగా కీర్తి సురేశ్ నటించనున్నారని ఇప్పటికే కొన్ని వార్తలు వచ్చాయి.
రజినీ మూవీలో నటించడం కీర్తి సురేష్ కి ఇది మొదటి సినిమా కావడంతో చాలా ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతుందంటున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందని ఆమె అంటున్నారు. ఈ మూవీలో మీనా నటిస్తున్నప్పటికీ ఆమె ఓ కీలక పాత్రలో నటిస్తుందని అంటున్నారు.. అది కూడా రజినీకి విలన్ పాత్రలో. గతంలో రమ్య కృష్ణ నరసింహా మూవీలో నిలాంబరిగా నటించి మెప్పించిన విషయం తెలిసిందే. మరి ఈ మూవీలో మీనా ఏ రేంజ్ లో అదరగొడుతుందో చూడాలి.