‘అల వైకుంఠపురములో’ మ్యానియాను మరింత పెంచడానికి త్రివిక్రమ్ తీసుకున్న షాకింగ్ నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఈసారి సంక్రాంతి రేసుకు భారీ సినిమాల తాకిడి చాల ఎక్కువగా ఉండటంతో ఈరేస్ లో విజయం సాధించడం అంత సులువైన పనికాదు అన్నవిషయం స్పష్టంగా త్రివిక్రమ్ కు అర్ధం అయినట్లు కనిపిస్తోంది. 

దీనితో ‘అల వైకుంఠపురములో’ మ్యానియాను మరింత పెంచడానికి త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ సహాయాన్ని కోరినట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ‘అల వైకుంఠపురములో’ టీజర్ కు వాయస్ ఓవర్ ఇచ్చి సహకరించ వలసిందిగా త్రివిక్రమ్ పవన్ ను వ్యక్తిగతంగా కలిసి కోరినట్లు టాక్. 

ఈ అనుకోని అభ్యర్ధనకు పవన్ కళ్యాణ్ కొద్దిసేపు షాక్ అయినప్పటికీ త్రివిక్రమ్ కోరికను తిరస్కరించలేదు అన్నవార్తలు వస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ వాయస్ ఓవర్ ను కేవలం ఈ మూవీ టీజర్ కు మాత్రమే పరిమితం చేస్తారా లేదంటే ఈ మూవీలో కూడ పవన్ వాయస్ ఓవర్ ఉంటుందా అన్న విషయమై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చిన తరువాత బన్నీ పవన్ కు సన్నిహితంగా మారడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. 

గత ఎన్నికల సమయంలో పవన్ కు ఓపెన్ గానే బన్నీ తన సంఘీభావాన్ని ప్రకటించారు. దీనితో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ల మధ్య రాజీ కుదిరిందా అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఈ టీజర్ కు సంబంధించిన వార్తలే నిజం అయి పవన్ కళ్యాణ్ వాయస్ ఓవర్ ‘అల వైకుంఠపురములో’ సినిమా టీజర్ లో వినిపిస్తే పవన్ కళ్యాణ్ అభిమానులు అంతా మళ్ళీ బన్నీతో కనెక్ట్ అయి ఈ మూవీకి అత్యంత భారీ ఓపెనింగ్స్ వచ్చే ఆస్కారం ఏర్పడుతుంది. దీనితో త్రివిక్రమ్ బిజినెస్ ప్లాన్ కు అతడి ప్రియ మిత్రుడు పవన్ ఎంతవరకు సహకరిస్తాడో చూడాలి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: