క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల చాల నెమ్మదిగా సినిమాలు తీస్తాడు. ‘ఫిదా’ లాంటి సూపర్ సక్సస్ వచ్చిన తరువాత కూడ అతడు మరొక సినిమాను మొదలు పెట్టడానికి రెండు సంవత్సరాల కాలం పట్టింది. ఈ పరిస్థితుల నేపధ్యంలో ప్రస్తుతం నాగచైతన్య సాయి పల్లవిలతో మూవీని చేస్తున్న శేఖర్ కమ్ములను నాగచైతన్య పూర్తిగా మార్చేశాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. 

వాస్తవానికి శేఖర్ కమ్ముల తీసిన సినిమాలలో హీరోయిన్ డామినేషన్ బాగా కనిపిస్తుంది. ‘ఆనంద్’ ‘గోదావరి’ ‘ఫిదా’ ఇలా చాల సినిమాలలో శేఖర్ కమ్ముల హీరోయిన్ పాత్రను ఎలివేట్ చేసి హీరో పాత్రను బాగా తగ్గించాడు. అయితే ఇప్పుడు నాగచైతన్య సాయి పల్లవిలతో మూవీని చేస్తున్న శేఖర్ కమ్ముల చైతూను ఒప్పించడానికి చైతన్య పాత్రను బాగా ఎలివేట్ చేసి కథ మార్చవలసి వచ్చింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. 

దీనికి కారణం ఇప్పటి వరకు శేఖర్ కమ్ముల పెద్ద హీరోలతో సినిమాలు చేయలేదు. వాస్తవానికి చైతన్య టాప్ రేంజ్ హీరో కాకపోయినా శేఖర్ కమ్ముల రేంజ్ కి పెద్ద హీరో. దీనితో అతడు ప్రస్తుతం తీస్తున్న ఈ మూవీ కథలో చైతన్యను ఎలివేట్ చేసే సీన్స్ చాల ఉంటాయి అన్న ప్రచారం జరుగుతోంది. 

దీనికోసం తాను ముందు రాసుకున్న స్క్రిప్ట్ లో మార్పులు చేయడమే కాకుండా సాయి పల్లవి పాత్రను కూడ తగ్గించి వేసాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని పసికట్టిన సాయి పల్లవి ఈ విషయమై శేఖర్ కమ్ములను ప్రశ్నించి తన పాత్రను తగ్గించి నందుకు తన అసంతృప్తిని వ్యక్త పరిస్తే ఆమెను శేఖర్ కమ్ముల తెలివిగా మేనేజ్ చేసాడు అన్న వార్తలు కూడ ఉన్నాయి. దీనితో హీరోయిజమ్ విలువను ఇంత ఆలస్యంగా అయినా శేఖర్ కమ్ముల గుర్తించాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనితో తనకు చేతకాని విద్యను ప్రదర్శిస్తున్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ అసలకు మోసం చేస్తాడా అన్న సందేహాలు కూడ ఉన్నాయి..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: