ప్రస్తుతం దేశవ్యాప్తంగా మహిళల భధ్రత విషయంలో తీవ్రంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల హైదరాబాద్లో జరిగిన వెటర్నరీ డాక్టర్ దిశ రేప్, హత్య ఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే ఈ విషయంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుటుమ్న్నాయి. చాలామంది సినిమా సెలబ్రిటీలు కూడా ఈ విషయంపై తీవ్రంగా స్పందిస్తున్నారు. అయితే ఇలాంటి సంఘటనపై ముప్పై ఏళ్ల క్రితం అమితాబ్ చేసిన వ్యాఖ్యలు ఆయన్న ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాయి.
ఇప్పటికే దిశకు జరిగిన అన్యాయంపై సినీ ప్రముఖలు తీవ్రంగా స్పందించారు. ఆ దుర్మార్గులను ఉరితీయాలంటూ ప్రజా పోరాటలకు తమ మద్ధుతు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ఈ దారుణాన్ని ఖండిచారు. అన్ని ఇండస్ట్రీలకు చెందిన టాప్ హీరోలు ఈ విషయంపై తీవ్రంగా స్పందిచటంతో ఆందోళనలు ప్రజా ఉద్యమంగా మారుతున్నాయి.
బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇలాంటి సంఘటనకు సంబంధించి గతంలో చేసిన ఓ కామెంట్ ఇప్పుడు వైరల్గా మారింది. 1990లో విడుదలైన మూవీ అనే మ్యాగజైన్ కవర్ పేజ్ మీద ఓ వార్తను పబ్లిష్ చేశారు. అత్యాచారం తప్పదనప్పుడు.. వెనక్కి పడుకొని దాన్ని ఎంజాయ్ చేయటమే అంటూ అతి నీచంగా అమితాబ్ చేసిన వ్యాఖ్యలు ఆయన్ను ఇబ్బందులు పాలు చేయనున్నాయాని తెలుస్తోంది. అయితే అప్పట్లో ఈ వ్యాఖ్యలు ఎలాంటి ప్రకంపనలు సృష్టించాయో తెలియదుగానీ.. ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో అమితాబ్ చేసిన ఆ కామెంట్ బాగా వైరల్ అవుతోంది.
అప్పట్లో యాంగ్రీ యంగ్ మెన్గా బాలీవుడ్ను ఏలేతున్న అమితాబ్ చేసిన కామెంట్స్. ఇన్నేళ్ల తరువాత కూడా ఆయన్ను వెంటాడుతున్నాయి. తాజాగా దిశ ఘటన తరువాత అమితాబ్ వ్యాఖ్యలను తెర మీదకు తీసుకువచ్చిన కొంత మంది నెటిజెన్లు, బాలీవుడ్ సూపర్ స్టార్లే ఇలా మాట్లాడుతుంటే ఇక రక్షణ ఎక్కడ ఉంటుంది అని తిరగబడే విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ముప్పై ఏళ్ళ క్రితం అయినప్పటికి మానవత్వం అనేది కాస్తైనా ఉండాలి కదా అంటూ అమితాబ్ మీద విరుచుకు పడుతున్నారు.