సూపర్ స్టార్ మహేష్ బాబు టైం ప్రస్తుతం పీక్ స్టేజ్ లో నడుస్తుంది. భరత్ అనే నేను మరియు మహర్షి లాంటి రెండు సూపర్ డూపర్ విజయాలు సాధించి అనిల్ రావిపూడి దర్శకత్వం లో సరిలేరు నీకెవ్వరు సినిమాతో హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫోటోలు మరియు టీజర్ సోషల్ మీడియాలో రికార్డుల మీద రికార్డులు నెలకొల్పు తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి రి ఎంట్రీ ఇవ్వటంతో సినిమాపై అటు టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఇటు అభిమానులలో అంచనాలు విపరీతంగా నెలకొన్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ జవాన్ పాత్రలో నటిస్తున్నాడు.

 

అంతేకాకుండా చాలా కాలం తర్వాత అప్పట్లో కమెడియన్ గా ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్ట్ గా ఉన్న బండ్ల గణేష్ తాజాగా ఈ సినిమాతో మళ్లీ కమెడియన్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాబోయే సంక్రాంతి సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో మళ్లీ మహేష్ బాబు తన కెరియర్ లో స్టార్టింగ్ సమయంలో గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన ఒక్కడు సినిమా టైపులో సరిలేరు నీకెవ్వరు సినిమాతో హిట్ కొడతాడా ..? అన్న చర్చ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్నట్లు సమాచారం. విషయంలోకి వెళ్తే మహేష్ బాబు కెరీర్ లోనే మొట్టమొదటి బ్లాక్ బస్టర్ హిట్ ‘ఒక్కడు’ అప్పట్లో 2003 వ సంవత్సరంలో సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమాతో మహేష్ బాబుకి మంచి క్రేజ్ ఏర్పడింది.

 

దీంతో మళ్లీ సంక్రాంతికి సేమ్ ‘ఒక్కడు’ సినిమా మాదిరిగానే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో పైగా ఒక్కడు సినిమా షూటింగ్ జరుపుకున్న కర్నూలు ప్రాంతంలోనే ఈ సినిమా షూటింగ్ కూడా జరుపుకోవడంతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ‘ఒక్కడు’ సినిమా ని గుర్తు చేస్తుందన్న చర్చ ఎక్కువగా సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో నడుస్తోంది. అంతేకాకుండా ‘ఒక్కడు’ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో మేప్పించిన క్రమంలో ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో కూడా అటువంటి పాత్రను వచ్చినట్టు టీజర్ బట్టి అర్థం అవుతోంది. మరి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో ఏ స్థాయిలో మహేష్ హిట్ కొడతాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: