టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లపై మహేష్ బాబు, అనిల్ సుంకర, దిల్ రాజు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే అఫీషియల్ ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు, 

 

మైండ్ బ్లాక్ అనే మాస్ సాంగ్ యూట్యూబ్ లో రిలీజ్ అయి ఆడియన్స్ నుండి మంచి స్పందనను రాబట్టాయి. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇకపోతే ఈ సినిమా తరువాత మహేష్ బాబు ఎవరి దర్శకత్వంలో నటిస్తారు అనే దానిపై కొద్దిరోజలుగా పలు టాలీవుడ్ వర్గాల్లో చర్చలు విపరీతంగా జరుగుతున్న నేపథ్యంలో, నేడు సడన్ గా ఆయన తదుపరి నటించబోయే 27వ సినిమాకు సంబంధించి అఫీషియల్ అప్ డేట్ రావడం జరిగింది. ఇటీవల సూపర్ స్టార్ తో మహర్షి వంటి సూపర్ డూపర్ హిట్ మూవీని తెరకెక్కించిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలోనే మరొక్కసారి మహేష్ బాబు నటించబోతున్నట్లు ప్రకటన రావడం జరిగింది. 

 

నిన్న సింహాచలం క్షేత్రం విచ్చేసిన వంశీ, తన తదుపరి సినిమా మహేష్ బాబు, దిల్ రాజు గారి కాంబినేషన్లో ఉంటుందని అక్కడి స్థానిక మీడియాతో చెప్పడం జరిగింది. దిల్ రాజు బ్యానరైన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం కాబోతున్న ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు అతి త్వరలో వెల్లడిస్తాం అంటూ దర్శకుడు వంశీ పైడిపల్లి ప్రకటించినట్లు పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. కాగా దీని పై మరికొద్దిరోజుల్లో అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కూడా మహర్షి మాదిరిగా మంచి ఆకట్టుకునే అంశంతో తెరకెక్కడంతో పాటు, మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. మరి మహర్షి మాదిరిగా ఈ సినిమా కూడా సక్సెస్ సాధిస్తుందో లేదో తెలియాలంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే. కాగా కొద్దిరోజుల నుండి మహేష్ బాబు, ప్రశాంత్ నీల్, పరశురామ్, సందీప్ రెడ్డి వంగ తదితరులతో సినిమా చేస్తారు అంటూ వచ్చిన పలు పుకార్లకు ఈ వార్తతో ఒక్కసారిగా అడ్డుకట్ట పడింది....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: