రాములమ్మ స్టెప్ తో మనల్ని అలరిస్తూ శ్రీముఖి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ షో లో చివరి వరకూ పోరాడి రాహుల్ సిప్లిగంజ్ చేతిలో ఓడిపోయిన తెలుగు రాష్ట్రాల్లో తన పోరాట పటిమతో ఆకట్టుకుంది. బిగ్ బాస్ నుంచి మంచి పేరు తో బయటకు వచ్చినా శ్రీముఖి కి ఇదివరకు ఉన్న క్రేజ్ లేదంటూ తన సన్నిహితులతో వాపోయినట్లు సమాచారం. 

 

బిగ్ బాస్ షో కి ముందు శ్రీముఖి లైఫ్ మూడు ప్రోగ్రాంలు ఆరు ఈవెంట్లు గా లైఫ్ 'బిందాస్' గా ఉండేది షోకి వెళ్లే ముందు తనకు బారీ రెమ్యూనరేషన్ ఇచ్చే షోల నుంచి శ్రీముఖి వైదొలిగింది, దానిలో ఈటీవీ లో ప్రసారమయ్యే పటాస్ షో ఒకటి, పటాస్ షో తోనే శ్రీముఖి బాగా పాపులర్ అయింది. బిగ్ బాస్ లో పాల్గొనేందుకు ఈ షో కు గుడ్ బై చెప్పిన ఈ భామ, మళ్ళీ పటాసులో రీఎంట్రీ ఇవ్వబోనని స్పష్టం చేసింది. 

 

బిగ్ బోస్ షో నుంచి బయటకు వచ్చిన తరువాత శ్రీముఖి ప్రముఖ తెలుగుదేశం టీవీ ఛానల్ స్టార్ మా లో మ్యూజిక్ రీలోడెడ్ యాంకరింగ్ చేస్తోంది. ఈ షో తప్ప ఆమెకు చెప్పుకోదగ్గ షోలు రావట్లేదు. మరోవైపు జబర్దస్త్ నుంచి నాగబాబు బయటకు రావడంతో నాగబాబు వెంట అతని అనుచర గణం బయటకు వచ్చేసింది. 

 

ఈ జాబితాలో అనసూయ కూడా ఉన్నట్లు తెలిస్తోంది. జబర్దస్త్ కు కొత్త యాంకర్ గా శ్రీముఖి ని తీసుకోనున్నట్లు సమాచారం అయితే ఇంతవరకు జబర్దస్త్ నిర్వాహకుల దగ్గర నుంచి మాత్రం అధికారీకంగా ప్రకటన ఏదీ రాలేదు. బిగ్ బాస్ షో తరువాత తన లైఫ్ మారిపోతుందని మంచి మంచి షోలు, సినిమాల్లో అవకాశాలు తనను వెతుక్కుంటూ వస్తాయని భావించానని అయితే బిగ్ బాస్ వల్ల కెరీర్ నాశనం అవుతుందని ఎప్పుడూ అనుకోలేదని శ్రీముఖి తెగ ఫీలవుతుందంట.

మరింత సమాచారం తెలుసుకోండి: