ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో  యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో 'RRR' సినిమా చేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే. ఇటువంటి నేపథ్యంలో రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి- జూనియర్ ఎన్టీఆర్ గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ నడుస్తోంది. విషయంలోకి వెళితే తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను మొన్నటిదాకా ఎంతగానో అలరించిన బిగ్ బాస్ రియాల్టీ షో నిర్వాహకులు రాబోయే సీజన్ 4 కోసం ఇప్పటి నుండే ప్రయత్నాలు మొదలు పెడుతున్నట్లు భారీ ఎత్తున ప్లాన్ లు చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన మూడు సీజన్లకు యాంకర్లుగా జూనియర్ ఎన్టీఆర్, నాని మరియు నాగార్జున అద్భుతంగా రాణించారు. దీంతో నెక్స్ట్ సీజన్ ఎవరు యాంకరింగ్ చేస్తారు అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో నెలకొంది.

 

ఇటువంటి నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ రాబోయే సీజన్ కోసం రెడీ అవుతున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇటువంటి నేపథ్యంలో తాజాగా బిగ్ బాస్ యాజమాన్యం మళ్లీ మొదటి సీజన్ కి యాంకరింగ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. గతంలో మూడవ సీజన్ ని తారక్ తోనే చేయించాలని అనుకున్నారు. కానీ 'RRR' సినిమాతో బిజీగా ఉండడం వల్ల అది కుదరలేదు.  దీంతో నెక్స్ట్ సీజన్ కి అయినా రాప్పించాలని ఇప్పటి నుంచే ప్లానింగ్స్ జరుగుతున్నాయట. నెక్స్ట్ సీజన్ కి తారక్ గనక ఒప్పుకుంటే డబుల్ పేమెంట్ ఇవ్వాలని కూడా నిర్వాహకులు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

 

మరోపక్క మెగాస్టార్ చిరంజీవి కూడా షో కి యాంకరింగ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు టెలివిజన్ రంగంలో వార్తలు వినబడుతున్నాయి. దీంతో బిగ్ బాస్ సీజన్ 4 యాంకరింగ్ విషయంలో ఇండస్ట్రీలో చిరంజీవి మరియు జూనియర్ ఎన్టీఆర్ ల పేర్లు ఎక్కువ వినిపిస్తున్న నేపథ్యంలో ఈ విషయం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: