వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా వెంకీ మామ. పాయల్ రాజ్ పుత్, రాశీఖన్నా ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిసెంబర్ 13వ తేదీన వెంకటేష్ పుట్టినరోజు కానుకగా వెంకీ మామ సినిమా విడుదల కాబోతుంది. వెంకటేష్, నాగచైతన్య అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజజీవితంలో మామా అల్లుళ్లైన వెంకటేష్, నాగచైతన్య సినిమాలో కూడా అదే పాత్రల్లో నటిస్తూ ఉండటం గమనార్హం.
 
నిన్న హైదరాబాద్ లో వెంకీమామ సినిమా గురించి ప్రెస్ మీట్ నిర్వహించారు. వెంకీ మామ సినిమా విషయంలో పడినంత టెన్షన్ తాను ఎప్పుడూ పడలేదని వెంకటేష్ చెప్పారు. ఈ స్టేజ్ ఎక్కడం ఎప్పుడూ కష్టమే అని 30 సంవత్సరాల నుండి స్టేజ్ ఎక్కడం.. టెన్షన్ పడటం.. కుర్ర హీరోలు కూడా నేర్చేసుకుంటున్నా నాకు మాత్రం రావట్లేదని వెంకటేష్ అన్నారు. తన తండ్రి రామానాయుడు ఇప్పుడు ఉండి ఉంటే వెంకీ మామ సినిమా చూసి ఎంజాయ్ చేసేవారని వెంకటేష్ చెప్పారు. 
 
తన తండ్రి రామానాయుడు కుటుంబంలో అందరితో కలిసి సినిమా తీయాలని అనుకున్నారని రానా, చైతన్యలతో వర్క్ చేయాలని అనుకుంటానని వెంకీమామతో కల నిజమైందని, తన కోరిక తీరిందని వెంకటేష్ చెప్పారు. నాన్నా ఈ సినిమా మీకోసమే అని వెంకటేష్ చెప్పారు. వెంకటేష్ నాగచైతన్య గురించి మాట్లాడుతూ చైతన్య ఎమోషన్ ను చక్కగా పండించాడని చైతన్యతో చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. 
 
థమన్ మంచి పాటలు, నేపథ్య సంగీతం ఇచ్చారని దర్శకుడు బాబీకి వెంకీ మామ సినిమా బెస్ట్ మూవీ అవుతుందని వెంకటేష్ అన్నారు. ప్రతి సీక్వెన్స్ బాగా వచ్చిందని బాబీ చాలా సెన్సిబుల్ గా ఈ సినిమాను తీశాడని వెంకటేష్ చెప్పారు. బాబీ మామాఅల్లుళ్ల కథతో రావడమే గొప్ప విషయమని వెంకటేష్ అన్నారు. ప్రేక్షకులు వెంకీ మామ సినిమాను ఆదరించాలని వెంకటేష్ కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: