సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో నడుస్తుంది. ‘భరత్ అనే నేను’ మరియు ‘మహర్షి’ లాంటి రెండు సినిమాలు వరుసగా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాలు సాధించడంతో మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్న సరిలేరు నీకెవ్వరు సినిమాతో రాబోయే సంక్రాంతికి హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు సరికొత్త లుక్ లో కనిపిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఆర్మీ జవాన్ క్యారెక్టర్ చేస్తున్న తరుణంలో సినిమా పై మహేష్ బాబు అభిమానులు బీభత్సమైన అంచనాలు పెట్టుకున్నారు. ఖచ్చితంగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో అదిరిపోయే హిట్ అందుకొని సంక్రాంతికి తమ అభిమాన హీరో మహేష్ బాబు మళ్లీ మా కాలర్ ఎగర వేయడం గ్యారెంటీ అన్నట్టుగా దీమా వ్యక్తం చేస్తున్నారు.

 

ముఖ్యంగా సినిమాకి సంబంధించిన స్టోరీ అదేవిధంగా అదిరిపోయే టైమింగ్ తో కూడిన కామెడీ సినిమాలో ఎక్కువ ఉన్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో కామెడీ ని డీల్ చేయడంలో అనిల్ రావిపూడి తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ప్రస్తుతం ఇండస్ట్రీలో ఏర్పరుచుకోవడం తో కచ్చితంగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్న నేపథ్యంలో మహేష్ బాబు ఈ సినిమా తర్వాత చేయబోయే నెక్స్ట్ సినిమా గురించి తాజాగా ఒక వార్త ఇండస్ట్రీలో మరియు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

 

అదేమిటంటే బయటకు వినబడుతున్న వార్తల ప్రకారం నెక్స్ట్ మహేష్ బాబు తన కెరీర్లో 25వ సినిమా మహర్షి సినిమా డైరెక్టర్ వంశీ పైడిపల్లి నీ మళ్లీ రిపీట్ చేయాలని వంశీ డైరక్షన్లో నెక్స్ట్ సినిమా చేయడానికి మహేష్ రెడీ అవుతున్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాగే ఫిలింనగర్లో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే మహేష్ స్పందించాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: