సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలకి సిద్ధం అవుతోంది. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అనిల్ రావిపూడి సినిమాలంటే ఫన్ ఖచ్చితంగా ఉంటుంది. తన పాత సినిమాల్లోలాగే సినిమాలో కూడా  కామెడీ ప్రేక్షకులని మెప్పిస్తుందట.

 


అయితే ఆ విషయం అటుంచితే మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రం తర్వాత ఎవరితో నటిస్తాడనే చర్చ జరిగింది. గత కొన్ని రోజులుగా సొషల్ మీడియాలో ఈ విషయంపై ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ విషయం గురించి మరోసారి చర్చ జరుగుతుంది. మహేష్ కెరీర్లో ఇరవై ఐదవ చిత్రంగా విడుదలై విజయం సాధించిన "మహర్షి" దర్శకుడితో తన తర్వాతి చిత్రం ఉంటుందట. వంశీ పైడి పల్లి మహర్షి తర్వాత ఇప్పటి వరకు ఏ సినిమాకు కమిట్ అవలేదు.

 

మహర్షి టైమ్ లోనే వంశీ పైడిపల్లికి మహేష్ మరో కమిట్ మెంట్ ఇచ్చాడట. దాంతో వంశీ స్క్రిప్టు పనుల్లోనే నిమగ్నమయ్యాడట. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన స్టొరీ సిట్టింగ్స్ జరుగుతున్నాయట. పైగా ఈ చిత్రం ఒక గ్యాంగ్ స్టర్ డ్రామాగా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తారట. మహర్షి లాంటి క్లాస్ సినిమా తీసిన ఈ దర్శకుడు  గ్యాంగ్ స్టర్ కథతో వస్తున్నాడంటే ఏదో కొత్తగా ఉంటుందని అర్థం అవుతుంది.

 

మహర్షి సినిమా మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం మహేష్ నటించిన "సరిలేరు నీకెవ్వరు " సినిమా సంక్రాంతి కానుకగా జనవరి ౧౨ వ తేదీన విడుదల అవుతుంది. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో సినియర్ నటి విజయశాంతి కూడా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: