సీనియర్ బ్యూటీ శ్రియ క్రేజీ ఆఫర్ దక్కించుకున్నట్టు టాక్. ఈ సైజ్ జీరో బ్యూటీ డి గ్లామర్ పర్ఫామెన్స్ తో మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతోందట. తమిళ సూపర్ హిట్ తెలుగు రిమేక్ లో ఈ ముదురు భామనే హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్టు వినిపిస్తోంది. ఇంతకీ శ్రియ నటించనున్న ఆ తమిళ రిమేక్ ఏంటో చూద్దాం.. 

 

తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన శ్రియ కొత్త భామల రాకతో వెనుకబడిపోయింది. అయితే ఈ బ్యూటీ ఏడాది కనీసం ఒకటి రెండు సినిమాలు చేస్తూ హీరోయిన్ గా తన ఉనికి చాటుకుంది. గౌతమి పుత్ర శాతకర్ణి, పైసా వసూల్ సినిమాల తర్వాత శ్రియకు మళ్లీ అలాంటి క్రేజీ సినిమాలు పడలేదు. లాస్ట్ ఇయర్ గాయత్రి, వీరభోగ వసంతరాయలు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీకి కలిసి రాలేదు. ఇలాంటి టైమ్ లో శ్రియకు క్రేజీ ఛాన్స్ దక్కినట్టు వినిపిస్తోంది. 

 

అసురన్ తెలుగు రిమేక్ లో శ్రియను హీరోయిన్ గా ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. తమిళంలో ధనుష్ హీరోగా నటించిన అసురన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రొడ్యూసర్ సురేష్ బాబు ఈ సినిమాను తెలుగులో వెంకటేష్  హీరోగా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ రిమేక్ లో వెంకటేష్ కు జోడీగా శ్రియను ఫైనల్ చేసినట్టు సమాచారం. చివరిగా వెంకటేష్, శ్రియ గోపాల గోపాల సినిమా కోసం జోడీ కట్టిన విషయం తెలిసిందే. 

 

వెంకటేష్ కు జోడీగా మొదట అనుష్కని తీసుకోవాలని భావించారు. కానీ చివరి నిమిషంలో శ్రియ అయితేనే బాగుంటుందని ఫిక్స్ చేశారట. ఒరిజినల్ మూవీ అసురన్ లో హీరోయిన్ ముగ్గురు పిల్లల తల్లిగా నటించింది. ఇప్పుడు తెలుగులో సైతం శ్రియ ముగ్గురు పిల్లల తల్లిగా యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రలో నటించబోతోంది. ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారని సమాచారం. 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: