గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపాయి. చాలామంది అప్పట్లో పవన్ కళ్యాణ్ పై కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలను ఖండించడం జరిగింది. అంతేకాకుండా కొన్ని కొన్ని మెయిన్ ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ లో ఇంటర్వ్యూలు కూర్చున్న సందర్భంగా కత్తి మహేష్ కి నేరుగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఫోన్ చేసి మరి వార్నింగ్ ఇచ్చిన ఘటనలో కూడా అప్పట్లో జరిగాయి. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాయలసీమ ప్రాంతంలో పర్యటన చేపడుతున్న క్రమంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కత్తి మహేష్ తాజాగా చేసిన సోషల్ మీడియాలో కామెంట్లు సంచలనంగా మారాయి.

 

విషయంలోకి వెళితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ ని టార్గెట్ చేసుకుని గత కొన్ని రోజుల నుండి రాయలసీమ ప్రాంతంలో వైసిపి పార్టీ బలంగా ఉండే చోట్ల షాకింగ్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కత్తి మహేష్ తనదైన శైలిలో సోషల్ మీడియాలో స్పందించారు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ జోకులు ఎక్కువ వేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ లో జగన్ పరిపాలన నీ హైదరాబాదులో జరిగిన దిశ ఘటనతో ముడిపెట్టడం చాలా హాస్యాస్పదంగా ఉందని కత్తి మహేష్ విమర్శించారు.

 

ఈమేరకు మాట్లాడిన కత్తి మహేష్… “మాతృభాషకి దిశ రేప్‌కి లింకేందిరా నాయనా.. వామ్మో. వాయ్యో.. ఈ సోదిగాడికి పిచ్చి పట్టిందిరో” అంటూ ఫేస్ బుక్‌ వేదిక ద్వారా పోస్టు చేశాడు కత్తి మహేష్. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కత్తి మహేష్ పెట్టిన పోస్ట్ పై తీవ్రస్థాయిలో కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది అభిమానులు అయితే బండ బూతులు కామెంట్ల రూపంలో కత్తి మహేష్ పై చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: