ప్రముఖ నిర్మాత సురేష్ బాబు నిర్మించిన మల్టీస్టారర్ వెంకీ మామా యొక్క ప్రమోషనల్ కార్యకలాపాలను నిర్మాతలు ప్రారంభించారు, ఇందులో అక్కినేని నాగ చైతన్య, వెంకటేష్, పాయల్ రాజ్‌పుత్ మరియు రాశి ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. వెంకీ మామా డిసెంబర్ 13న గ్రాండ్ రిలీజ్ కోసం సిద్ధమవుతోంది, ఇదే రోజున విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు కూడా కావడంతో ఈ సినిమా విక్టరీ వెంకటేష్ కు మంచి జ్ఞాపకంగా మిగిలిపోనుంది. 

 

వెంకీ మామ మూవీ ప్రమోషన్లలో బాగంగా సురేష్ బాబు ఒక ప్రెస్ మీట్ కు హాజరయ్యారు ఈ సందర్భంగా వెంకీ మామ యొక్క క్లైమాక్స్ చూసిన తరువాత తన కళ్ళలో నీళ్లు తిరిగాయని, అసలు కన్నీళ్లు ఆపుకోలేకపోయానని చెప్పారు సురేష్ బాబు. సురేష్ బాబు వెంకీ మామా సినిమా గురించి మాట్లాడుతూ ఈ చిత్రంలో వినోదం అధికంగా ఉండటమే కాకుండా ఆర్మీ ఎలిమెంట్ కనెక్ట్ కావడం వల్ల మూవీ చాలా ఎమోషనల్ గా ఉంటుందని వెల్లడించారు. వెంకీ మామలో నాగ చైతన్య కెప్టెన్ కార్తీక్ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. "వెంకీ మామ క్లైమాక్స్ చూసిన తరువాత నేను నా కన్నీళ్లను ఆపుకోలేకపోయాను" అని చెప్పారు సురేష్ బాబు.

 

ఇటీవలే, వెంకీ మామ బృందం ఒక వీడియోను విడుదల చేసింది, దీనిలో రానా దగ్గుబాటి దర్శకుడు కెఎస్ రవీంద్ర అలియాస్ బాబీని  విడుదల తేదీ గురించి అడగగా బాబీ రానా చెవిలో డిసెంబర్ 13న అని చెప్పారు దీనితో వెంకీ మామ డిసెంబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోందని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. వెంకీ మామకు బాబీ దర్శకత్వం వహించారు, టిజి విశ్వ ప్రసాద్ మరియు సురేష్ బాబు ఈ సినిమాని నిర్మించారు. డిసెంబర్ 7న వెంకీ మామా ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించాలని సురేష్ బాబు నిర్ణయించినట్లు సమాచారం. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించి అధికారీకంగా ఇంత వరకూ ఎటువంటి ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: