బాహుబలి 2 తరువాత  రెండుళ్లు  గ్యాప్ తీసుకొని  ఇటీవల సాహో తో ప్రేక్షకులముందుకు వచ్చిన  రెబల్ స్టార్ ప్రభాస్ కు ఆ సినిమా షాక్ ఇచ్చింది. భారీ అంచనాల మధ్య  విడుదలైన సాహో ఒక్క హిందీ లో తప్ప  మిగితా అన్ని భాషల్లో  డిజాస్టర్ ఫలితాన్ని  రాబట్టింది. అయితే విపరీతమైన  నెగిటివ్ టాక్ తో కూడా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా  400కోట్ల వసూళ్లను రాబట్టి  ప్రభాస్ స్టామినా  ఏంటో నిరూపించింది.  హిందీ లో అయితే ఏకంగా 150కోట్ల వసూళ్లను రాబట్టి అక్కడ  సూపర్ హిట్ అనిపించుకుంది. అక్కడ ఈఏడాది   వార్, యూరి తరువాత  అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమా కూడా  సాహోనే కావడం విశేషం.  
 
 
ఇక ఈ చిత్రం  సెట్స్ మీద ఉండగానే  ప్రభాస్జిల్ ఫేమ్ రాధాకృష్ణ  డైరెక్షన్ లో  ఓ సినిమా  కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈచిత్రానికి  జాన్ అనే టైటిల్  ప్రచారం లో వుంది.  ఇటీవలే  ఇటలీ  లో మొదటి షెడ్యూల్ కూడా కంప్లీట్ అయ్యింది.  అయితే నవంబర్ లో  స్టార్ట్ కావల్సిన రెండవ షెడ్యూల్  ఇంకా స్టార్ట్ కాలేదు. దానికి కారణం సాహో ఇచ్చిన షాక్ తో  జాన్  స్క్రిప్ట్ లో  కొన్ని మార్పులు చేయమని చెప్పాడట  ప్రభాస్.  తను చెప్పినట్లు మార్పులు చేసిన  కూడా ప్రభాస్  సాటిస్ఫై కాలేదట.  దాంతో మళ్ళీ మార్పులు చేయమని కోరాడట.  అలా ప్రస్తుతం  ప్రభాస్  ఈ సినిమా ను  హోల్డ్ లో పెట్టాడట. అన్ని కుదిరితే  జనవరి నుండి  ఈచిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.  
 
 
పీరియాడికల్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ  చిత్రంలో  పూజా హెగ్డే  హీరోయిన్ గా నటిస్తుంది.  భారీ బడ్జెట్ తో  గోపికృష్ణ మూవీస్ ,యువీ క్రియేషన్స్ సంయుక్తంగా   నిర్మిస్తుండగా  సైరా ఫేమ్  అమిత్ త్రివేది  సంగీతం అందిస్తున్నాడు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: