ఈమధ్యకాలంలో టాలీవుడ్ లోకి  ఒక్కసారిగా దూసుకొచ్చిన కొత్త తరం హీరోయిన్స్ లో భామ నిధి అగర్వాల్ బాగా ఫేమస్ అయింది. అభినయంలో అంత లేకపోయినా అందంలో మాత్రం టాప్ అని చెప్పాలి. నిజానికి నిధీ దృష్టంతా మొదట బాలీవుడ్ పైనే ఉండేది. టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన 'మున్నా మైఖేల్' సినిమాతో ముందుగా బాలీవుడ్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా తర్వాత బాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో టాలీవుడ్ లో లక్ ట్రై చేసుకుందామని వచ్చింది. ఇక్కడ నిధికి మంచి ఆఫర్లే వచ్చాయి. 'సవ్యసాచి'.. 'మిస్టర్ మజ్ను' నిరాశ పరిచినా 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో మంచి హిట్ అందుకుంది.

 

ఈమధ్యలో తమిళ సినిమాల మీద కూడా బాగానే ఫోకస్ చేస్తోంది నిధి.  క్రేజీ ఆఫర్లయితే రాలేదు కానీ ప్రస్తుతం ఒక సినిమాలో నటిస్తోంది.  అయితే హిందీ.. తమిళం పై ఫోకస్ చేస్తూ ఉండడంతో ఈమధ్య తెలుగులో కొన్ని ఆఫర్లు జారిపోయాయి. దీంతో తేడా కొడితే రోడ్డున పడాల్సి వస్తుందని తెలుగులో ఆఫర్లు మిస్ చేసుకోకూడదని నిర్ణయించుకుందట. అందుకే గతంలో ఉన్న మేనేజర్ ను కూడా మార్చేసిందని తాజా సమాచారం.  ప్రస్తుతం తనకు ఆఫర్లు ఇప్పించడం.. డీల్ సెట్ చేయడం కోసం క్వాన్ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకుందట ఈ ఇస్మార్ట్ బ్యూటి. ఇప్పటినుంచి నిధి సినిమాల సంగతి క్వాన్ వారే చూసుకుంటారని లేటెస్ట్ న్యూస్.  

 

ఇక నిధి చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా డెబ్యూ ఫిలిం.. మరొకటి తమిళం సినిమా 'భూమి'. మేనేజర్ ను మార్చిన తర్వాత నిధి కెరీర్ ఎటువైపు మలుపు తీసుకుంటుందో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. మరి ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాలు హిట్టైతే టాప్ హీరోయిన్ గా సెటిలై పోతుంది. లేదంటే మళ్ళీ కథ మామూలే. ఇకపోతే నిధీ కోసం మెగా హీరోలు కూడా తమ సినిమాలో నిధి ని సజస్ట్ చేస్తున్నారట. ఆల్రెడీ వరుణ్ తేజ్, సాయి ధరం తేజ్ సినిమాలకోసం నిధి ని సంప్రదించినట్లు మొన్నామధ్య వార్తలు కూడా వచ్చాయి. ఒకవేళ నిజంగా మెగా కాంపౌండ్ నుంచి గనక ఆఫర్ వస్తే నిధి కంటే లక్కీ గాళ్ మరొకరుండరు.   

మరింత సమాచారం తెలుసుకోండి: