టాలీవుడ్ లోకి ఇటీవల దూసుకొచ్చిన కొత్త అందం నిధి అగర్వాల్.  టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన 'మున్నా మైఖేల్' సినిమాతో మొదట బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.  అయితే ఆ సినిమా తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో టాలీవుడ్ లో ఒకసారి లక్కు టెస్టు చేసుకుందామని వచ్చింది. ఇక్కడ నిధికి మంచి ఆఫర్లే వచ్చాయి. 

 

'సవ్యసాచి'.. 'Mr.మజ్ను' నిరాశ పరిచినా 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో మంచి హిట్ అందుకుంది. దాంతో తమిళ సినిమాలపై కూడా ఫోకస్ చేసింది.  క్రేజీ ఆఫర్లయితే రాలేదు కానీ ప్రస్తుతం ఒక సినిమాలో నటిస్తోంది.  అయితే హిందీ.. తమిళం పై ఫోకస్ చేస్తూ ఉండడంతో ఈమధ్య తెలుగులో కొన్ని ఆఫర్లు పోయాయట. దీంతో మొదటికే మోసం వస్తుందని తెలుగులో ఆఫర్లు మిస్ చేసుకోకూడదని నిర్ణయించుకుందట. 

 

గతంలో ఉన్న మేనేజర్ ను కూడా మార్చేసిందని సమాచారం.  ప్రస్తుతం తన కు ఆఫర్లు ఇప్పించడం.. డీల్ సెట్ చేయడం కోసం క్వాన్ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకుందట.  ఇకపై నిధి సినిమాల సంగతి క్వాన్ వారే చూసుకుంటారు.  నిధి చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా డెబ్యూ ఫిలిం.. మరొకటి తమిళం సినిమా 'భూమి'.  మేనేజర్ ను మార్చిన తర్వాత నిధి కెరీర్ ఎటువైపు మలుపు తీసుకుంటుందో తెలియాలంటే మనం కొంతకాలం వేచి చూడకతప్పదు.

 

అందాలతో పిచ్చెక్కించేలా ఆమె అందాలు ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇస్మార్ట్ శంకర్ సినిమా రిలీజ్ అయిన వెంటనే ఈ అమ్మడి పాపులేషన్ కూడా భారీగా పెరిగింది.  అందుకే సినిమా అవకాశాలతో పాటుగా బయట అవకాశాలు కూడా ఎక్కువగా వచ్చిపడుతున్నాయి. అందుకే ఏడ అందాలతో రెచ్చిపోతుంది.. ఈ మధ్య మరింత ఎక్కువగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తుంది.. లైకులతో పాటుగా కామెంట్లు కూడా భారీగానే అందుకుంటుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: