సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా 2020 సంక్రాంతికి రిలీజవబోతోంది. ఇక వంశీ పైడిపల్లి తెరకెక్కించిన మహర్షి బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇదే కాంబినేషన్ లో మహేష్ 27 వ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. ఈ సినిమా ఎవరు తెరకెక్కించబోతున్నారన్న విషయంలో ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. సుకుమార్ తో సినిమా క్యాన్సిల్ అయ్యాక సరిలేరు చిత్రీకరణలో మహేష్ బిజీ అయ్యారు. అయితే మహర్షి టైమ్ లోనే వంశీ పైడిపల్లికి మహేష్ మరో కమిట్ మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

 

ప్రస్తుతం పైడిపల్లి ఆ సినిమా పనిలోనే ఉన్నారు. మహేష్ కోసం స్క్రిప్టును రెడీ చేస్తున్నారు. అయితే పైడిపల్లి స్క్రిప్టు ఫైనల్ అయ్యిందా లేదా? అన్నదానిపై ఇప్పటివరకూ ఏ క్లారిటీ లేదు. మహేష్ కానీ పైడిపల్లి కానీ ఇప్పటివరకూ ఎక్కడా ఆ ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారం రివీల్ చేయలేదు. దీంతో ఫ్యాన్స్ లో కాస్త డైలమా నెలకొంది. అయితే అన్ని ప్రశ్నలకు సమాధానంగా ఫ్రెష్ అప్‌డేట్ వచ్చేసింది. 

 

ఎట్టకేలకు మహేష్ నటించే నెక్స్ట్ 27వ సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నారని లేటెస్ట్ న్యూస్. ఈ విషయాన్ని పైడిపల్లి స్వయంగా వెల్లడించారు. ఈ బుధవారం వైజాగ్ లో జరిగిన ఓ ఈవెంట్ లో వంశీ పైడిపల్లి మాట్లాడుతూ మహేష్ తోనే తన నెక్స్ట్ సినిమా ఉండనుందని ప్రకటించారు. అంతేకాదు మహర్షి నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మించనున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉందట. ఇక ఈ సినిమాలో మహేష్ ఎలాంటి పాత్రలో నటిస్తారు? అన్నదానికి రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే ఈసారి మహేష్ ని ఒక గ్యాంగ్ స్టర్ గా చూపించేందుకు వంశీ పైడిపల్లి స్క్రిప్టును పక్కాగా రెడీ చేస్తున్నారట. సాధారణంగా బాలీవుడ్ లో గ్యాంగ్‌స్టర్ సినిమాలకు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి సినిమా..అందులో మహేష్ హీరోగా అంటే ఇక ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవడం కాస్త కష్టమే. మరి ఈ సినిమాతో మహేష్ కి హాలీవుడ్ స్టార్ హీరోల రేంజ్ వస్తుందా అని కొందరు చెప్పుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: