టాలీవుడ్ ఇండస్ట్రీలో దగ్గుబాటి కుటుంబం నుండి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లీడర్ సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చిన దగ్గుబాటి రానా ఆ తరువాత ఒక్క తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజియస్ట్ ప్రాజెక్టులలో నటించి పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. కాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ సపరేట్ గుర్తింపు క్రేజ్ క్రియేట్ చేసుకున్న రానా ప్రస్తుతం భవిష్యత్తులో చేయబోతున్న ప్రాజెక్టుల విషయంలో యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథలని ఎంచుకుంటున్నాడు. రానా బాలీవుడ్ లో 'హాథీ మేరే సాథీ' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఒక హిందీలో మాత్రమే కాకుండా తెలుగు తమిళ భాషల్లో కూడా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ఎక్కువగా అడవి జంతువుల మధ్య ఉండే మనిషి ఏవిధంగా ప్రవర్తిస్తాడు అన్నా కాన్సెప్టు పై తెరకెక్కబోతుంది.

 

తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఏనుగులతో రానా ఉన్న ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా షూటింగ్ చాలా స్పీడుగా జరుగుతుంది. ఇదిలా ఉండగా సినిమాలో హీరోయిన్ గా  శ్రీయ పిల్గాన్కర్ నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె సోషల్ మీడియాలో దగ్గుబాటి రానా గురించి సంచలన కామెంట్స్ చేసింది. విషయంలోకి వెళితే సినిమా షూటింగులో తన క్యారెక్టర్ కు సంబంధించి షూటింగ్ మొత్తం పూర్తి అయిందని పేర్కొంది. ఇన్స్టాగ్రామ్ లో హీరో రానాపై ప్రశంసలు కురిపించింది.

 

సెట్స్ లో ఉన్నప్పుడు రానా స్టార్ కాదు.. నిత్య విద్యార్థి. అతడి కమిట్మెంట్ కు ఆశ్చర్యపోయా అని శ్రీయ పేర్కొంది. తాను నటిస్తున్న మొట్టమొదటి బహుభాషా చిత్రం ఇదేనని, అద్భుతమైన టీంతో వర్క్ చేసినందుకు సంతోషంగా ఉందని శ్రీయ చెప్పుకొచ్చింది. ప్రభు సోలమన్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా వచ్చే సంవత్సరం విడుదల కానుంది. ఇంకా కొద్ది పాటి షూటింగ్ మినహా సినిమా దాదాపు పూర్తి అయినట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: