పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరికీ మోస్ట్ వాంటెడ్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయి వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న 'అల వైకుంఠ పురంబులో' హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా మాత్రమే కాకుండా అక్కినేని అఖిల్ నటిస్తున్న సినిమాలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తుంది. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో భవిష్యత్తులో చేయబోయే ప్రాజెక్టుల గురించి అలాగే జిల్ ఫెమ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాతకాలం నాటి ప్రేమకథా చిత్రం లో హీరోయిన్ గా కూడా చేస్తుంది.

 

ఈ సందర్భంగా పూజా హెగ్డే త్వరలోనే అనగా జనవరి నుండి ప్రభాస్ తో చేయబోయే సినిమా రెగ్యులర్ షూటింగ్లో పాల్గొననున్నట్లు తాజాగా ఇంస్టాగ్రామ్ లో వీడియో చాటింగ్ లో తెలిపింది. అంతేకాకుండా భవిష్యత్తులో చేయబోయే ప్రాజెక్టుల్లో చాలా ఉన్నాయని కానీ వాటి విషయాల్లో నేను చెప్పడం అంటే సదరు ప్రాజెక్టు నిర్మించబోయే ప్రొడ్యూసర్ ఎనౌన్స్ చేస్తే బాగుంటుందని వాటికి సంబంధించిన విషయాలు అధికారికంగా వాళ్లే చెబుతారని పూజా హెగ్డే ఇంస్టాగ్రామ్ లో తెలిపింది. ఈ క్రమంలో ఓ అభిమాని కన్నడ సినిమాల్లో నటించాలని కోరగా...ఖచ్చితంగా నటిస్తున్న ఒక కామెడీ నేపథ్యం కలిగి ఉన్న సినిమా అయితే కచ్చితంగా ఓకే చేస్తాను పూజా హెగ్డే చెప్పుకొచ్చింది.

 

దీంతో పూజా హెగ్డే చెప్పిన ఎనౌన్స్ మెంట్ తో ప్రభాస్ అభిమానులు తమ హీరో నుండి కాక హీరోయిన్ పూజా హెగ్డే నుండి ఒక క్లారిటీ రావడంతో చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా సాహో సినిమా దారుణంగా ఫ్లాప్ కావడంతో తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో చేయబోయే సినిమా విషయాలు ఏమీ కూడా ఇప్పటివరకు బయటకు రాకపోవడం తో...కన్ఫ్యూజన్ లో ఉన్న ప్రభాస్ అభిమానులకు పూజా హెగ్డే ఇంస్టాగ్రామ్ లో చెప్పిన విశేషాలకు ఒక క్లారిటీ రావడంతో మంచి జోష్ మీద ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్.  

మరింత సమాచారం తెలుసుకోండి: