టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో హీరోగా నటిస్తన్న విషయం తెలిసిందే. లేడీ సూపర్ స్టార్ విజయశాంతిసినిమా ద్వారా చాలా ఏళ్ళ తరువాత టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇస్తున్నారు. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా రత్నవేలు ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. 

 

ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ మరియు మైండ్ బ్లాక్ లిరికల్ సాంగ్ మంచి సక్సెస్ సాధించడంతో పాటు సినిమా పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెంచేసాయి. ఇక దీని తరువాత మహేష్ బాబు ఏ దర్శకుడితో పని చేస్తారు అనే దానిపై కొద్దిరోజులుగా వార్తలు ప్రచారం అవుతుండగా, నేటితో వాటన్నిటికీ తెర దించుతూ దర్శకుడు వంశీ పైడిపల్లి ఒక ప్రకటన చేసారు. మహేష్ తో తదుపరి సినిమాను తాను తెరకెక్కిస్తున్నానని, దిల్ రాజు సంస్థైన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోయే ఆ సినిమా కథ ప్రస్తుతం ప్రోసెసింగ్ స్టేజ్ లో ఉందని, 

 

అతి త్వరలో అన్ని వివరాలు అధికారికంగా వెల్లడవుతాయని చెప్పడం జరిగింది. నిన్న సింహాచల పుణ్యక్షేత్రం విచ్చేసిన వంశీ, అక్కడి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు. కాగా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు ఈ సినిమాలో తొలిసారి ఒక పవర్ఫుల్ డాన్ క్యారెక్టర్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో మంచి యాక్షన్ మరియు మాస్ ఎంటర్టైనర్ గా తేలాకేక్కబోయే ఈ సినిమాలో మహేష్ పాత్ర, మొత్తం సినిమాకు పెద్ద హైలైట్ అని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే, సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇది పండుగ వార్తే అని చెప్పాలి.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: