ఇటీవల జబర్దస్త్ కామెడీ షో నుండి మెగాబ్రదర్ నాగబాబు అర్ధాంతరంగా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ షో కు మేనేజర్లుగా ఉన్న ఇద్దర్లు కుర్రాళ్లకు ఎంతో అన్యాయం జరిగిందని, షో నిర్వాహకులు వారిని సడన్ గా బయటకు పంపేశారని, అటువంటి వారిని ఆదుకోవాడనికి తన వంతుగా ఏదో చేయాలనే తలంపుతో జబర్దస్త్ నుండి బయటకు వచ్చి, మరొక ఛానల్ లో వారు నిర్వహిస్తున్న షోలో పార్టిసిపేట్ చేయబోతున్నట్లు నాగబాబు చెప్పారు. 

 

అయితే ఇదంతా ఆ షో నిర్వాహక సంస్థైన మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి తెలిసి ఉండదని, ఎందుకంటే స్వతహాగా మంచి వ్యక్తయిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి, మధ్యలో కొందరు చేసే రాజకీయాలు తెలిసి ఉండవని తన అభిప్రాయం అని నాగబాబు అన్నారు. అయితే ఆ షో నుండి నాగబాబు సడన్ గా బయటకు రావడానికి అదొక్కటే కారణం కాదని అంటున్నారు కొందరు. ఇక ఈ విషయమై నేడు ప్రచారం అవుతున్న వార్తలను బట్టి, ఇటీవల జనసేన పార్టీ తరపున నరసాపురం ఎంపీగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయిన నాగబాబు, ఇకపై తన తమ్ముడికి వీలైనంత ఎక్కువగా అండగా ఉండాలని, 

 

అలానే జనసేన పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తన వంతుగా బాధ్యత తీసుకోవాలని నిర్ణయించారట. ఇక తన షెడ్యూల్ ప్రకారం అక్కడక్కడా కొన్ని టివి షోలు చేయడంతో పాటు, మిగిలిన సమయాన్నంతా కూడా ఆయన జనసేన పార్టీ కోసం వీలైనంత ఎక్కువగా గడపబోతున్నారట. ఈ విధంగా చేయడం వలన రాబోయే ఎన్నికల సమయానికి పార్టీ పై ప్రజల్లో మంచి నమ్మకం ఏర్పడుతుందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందొ తెలియదుగాని, ప్రస్తుతం ఈ వార్త పలు సినీ, రాజకీయ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది......!!

మరింత సమాచారం తెలుసుకోండి: