టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా తర్వాత సినిమా చేస్తూ మంచి స్పీడు మీదున్నాడు. బహుశా ఇలాంటి ప్లానింగ్ టాలీవుడ్ లో మహేశ్ పాటించినట్టు మరే హీరో కూడా పాటించడేమో. ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్న మహేశ్ కు ఇది 26వ సినిమా. ఇదే స్పీడ్ లో మహేశ్ తన 27వ సినిమాను కూడా ప్లాన్ చేసేశాడు. మహర్షితో తనకు హిట్ సినిమా ఇచ్చిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో ఓ ఆసక్తికరమైన వార్త షికారు చేస్తోంది.

 

మహేశ్ ఈ సినిమాలో పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తున్నాడని ఫిల్మ్ నగర్ సమాచారం. ఇండస్ట్రీ వర్గాల్లో ఈ వార్త హాట్ టాపిక్ అయింది. ఈ వార్త నిజమే అయితే మహేశ్ అభిమానులకు ఇది పండుగ లాంటి వార్తే అని చెప్పాలి. గతంలో మహేశ్ ఈ తరహా పాత్ర పోకిరిలో చేశాడు. బిజినెస్ మేన్ లో కొద్దిగా ఆ షేడ్స్ ఉన్న పాత్రనే పోషించాడు. అయితే పూర్తిస్థాయి గ్యాంగ్ స్టర్ గా చేయలేదు. వంశీ ఆ తరహా కథ సిద్ధం చేసి మహేశ్ ను ఒప్పించాడని అంటున్నారు. వంశీ స్టైలిష్ టేకింగ్ లో మహేశ్ ను డాన్ గా బాగా ప్రెజెంట్ చేస్తాడనే భావించాలి.

 

మహర్షి సినిమా సక్సెస్ మీట్ లో వంశీకి మహేశ్ ముద్దు కూడా ఇచ్చాడు. మంచి కథ సిద్ధం చేస్తే త్వరలోనే మరో సినిమా చేద్దాం అని వంశీతో మహేశ్ అన్నట్టు గతంలోనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందని అంటున్నారు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించనున్నాడు. ఈ వార్తల్లో నిజమెంతుందో మహేశ్, వంశ్, దిల్ రాజుల్లో ఎవరో ఒకరు కన్ఫర్మ్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: