టాప్ హీరోల మధ్య ఇగో సర్వసాధారణం. వాస్తవానికి మహేష్ అల్లు అర్జున్ ల మధ్య చెప్పుకో తగ్గ శతృత్వం కాని మిత్రత్వం కాని లేదు. కానీ వీరిద్దరి సినిమాలు ఇప్పుడు ఒకేసారి సంక్రాంతి రేసుకు వస్తూ వీరిద్దరి మధ్య అనుకోని చిచ్చును మళ్ళీ రేపుతున్నాయి. 

‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురములో’ మూవీల విడుదల మధ్య ఒకరోజు గ్యాప్ ఉండే విధంగా ఈ మూవీ నిర్మాతలు నిర్ణయం తీసుకోవడంతో ఈ మూవీల బయ్యర్లు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఆలోచనలు మారాయి అన్న వార్తలు వస్తున్నాయి. 

ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీని జనవరి 11న కాకుండా ముందుగా అనుకున్నట్లుగానే జనవరి 12న ‘అల వైకుంఠపురములో’ మూవీతో పోటీగా విడుదల చేయాలని లేటెస్ట్ గా నిర్ణయం తీసుకున్నట్లు లీకులు వస్తున్నాయి. ఈ కారణంగానే ఈమూవీకి సంబంధించి లేటెస్ట్ గా విడుదల చేస్తున్న పోస్టర్స్ లో రిలీజ్ డేట్ జనవరి 11 అని ప్రకటించకుండా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని టాక్. 

ఇలా మహేష్ నిర్ణయంలో మార్పులు రావడానికి ఒక కారణం ఉంది అని అంటున్నారు. జనవరి 11 శనివారం కావడంతో మహేష్ కు సెంటిమెంట్ రీత్యా శనివారం అంతగా కలిసిరాదని కొందరు సలహాలు ఇవ్వడంతో ఇప్పుడు మళ్ళీ మహేష్ యూటర్న్ తీసుకుని తాను ముందుగా ప్రకటించిన జనవరి 12 డేట్ కు ఖరార్ అయిపోయినట్లు టాక్. దీనితో కుదిరింది అనుకున్న రాజీ మార్గం మళ్ళీ సమస్యగా మారడంతో ఈ ఊహించని ట్విస్ట్ కు అల్లు అర్జున్ కలవర పడుతూ మహేష్ నిర్ణయాన్ని ఎలా మార్చాలో తెలియక తికమక పడుతున్నట్లు టాక్. ఈ వార్తలే నిజం అయితే ధియేటర్ల సంఖ్య దగ్గర నుండి అభిమానుల వార్ వరకు అన్ని విషయాలలోను బన్నీ మహేష్ లకు తల నొప్పులు తప్పేలా లేవు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: