రానా తన చినాన్న వెంకటేష్ ను ఎంతో అభిమానిస్తాడు. తన చిన్నతనం నుంచి తనకు సినిమాలలోకి రావాలి అన్న కోరిక వెంకటేష్ సినిమాలను చూస్తూ పెరగడం వల్ల  వచ్చింది అంటూ అనేకసార్లు చెప్పాడు. ఇలాంటి పరిస్థితులలో వచ్చే వారం విడుదల కాబోతున్న ‘వెంకీ మామ’ కు రానా వల్ల అనుకోని కస్టాలు ఏర్పడ్డాయి అన్న వార్తలు వస్తున్నాయి.

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీని మొదలుపెట్టే సమయంలో నిర్మాత సురేశ్ బాబు ఈ మూవీని 30 కోట్ల బడ్జెట్ తో పూర్తిచేయాలి అని భావించాడట. అయితే ఈమూవీ 50 కోట్ల బడ్జెట్ కు దరిదాపుకు చేరుకోవడంతో ఈ మూవీ పరిస్థితి పట్ల సురేశ్ బాబు అసంతృప్తితో ఉన్నాడు అంటూ గాసిప్పులు వస్తున్నాయి. 

మూవీ బడ్జెట్ ఇలా పెరిగి పోవడానికి గల కారణం ఈ మూవీ దర్శకుడు బాబీకి ఈ మూవీలోని వెంకటేష్ పాత్ర మిలట్రీనాయుడు అని అంటున్నారు. ఈ మూవీలోని సన్నివేశాలు కాశ్మీర్ లో షూట్ చేయడంతో పాటు ఈ మూవీకి సంబంధించి పనిచేసిన స్టార్స్ అందరు టాప్ ర్యాంకింగ్ సెలెబ్రెటీలు కావడంతో ఈ మూవీకి ఈ రేంజ్ లో ఖర్చు పెరిగింది అంటూ వార్తలు వస్తున్నాయి. 

అయితే ఈ బడ్జెట్ ఇలా పెరిగి పోవడానికి మరొక కారణం ఉంది అని కూడ ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ షూటింగ్ చాల వేగంగా జరుగుతున్న రోజులలో నిర్మాత సురేశ్ బాబు తన దృష్టిని అంతా రానా ఆరోగ్యం పై పెట్టి తరుచు అమెరికాకు వెళ్ళి వచ్చిన నేపధ్యంలో ఈ మూవీ బడ్జెట్ పై కంట్రోల్ తప్పి అది 50 కోట్లకు చేరుకుంది అన్న వార్తలు కూడ ఉన్నాయి. దీనితో ప్రస్తుతం ఎలాంటి పండుగలు లేని ఈ అన్ సీజన్ డిసెంబర్ ‘వెంకీ మామ’ కు పాజిటివ్ టాక్ వచ్చినా కలక్షన్స్ పరంగా ఎంతవరకు సహకరిస్తుంది అన్న భయం సురేశ్ బాబులో ఉంది అంటూ ప్రస్తుతం ఈ మూవీ విజయం పై ఒక నెగిటివ్ ప్రచారం ఇండస్ట్రీ వర్గాలలో జరుగుతోంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: