‘మహర్షి’ మూవీ తరువాత దర్శకుడు వంశీ పైడిపల్లి మహేష్ ల మధ్య సాన్నిహిత్యం విపరీతంగా పెరిగింది. ఈ సాన్నిహిత్యంతోనే మహేష్ వంశీ పైడిపల్లికి మరొక అవకాశం ఇచ్చాడు అన్న ప్రచారం జరుగుతున్నా ఆ విషయం పై ఇంకా స్పష్టమైన క్లారిటీ మహేష్ నుండి రాలేదు. 

ఇలాంటి పరిస్థితులలో ఒక ప్రవేట్ కార్యక్రమం కోసం విశాఖపట్నం వచ్చిన వంశీ పైడిపల్లి తాను మహేష్ తో మరొక సినిమాను చేయబోతున్న విషయమై లీకులు ఇచ్చాడు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ అంతా ఇంచుమించు పూర్తి అయిందనీ త్వరలోనే ఈ స్క్రిప్ట్ ను మహేష్ కు వినిపించబోతున్నట్లు వంశీ తనను కలిసిన మీడియా ప్రతినిధులతో చెప్పినట్లు వార్తలు ఉన్నాయి. 

ఈ కథలో మహేష్ డాన్ గా కనిపిస్తాడని కూడ వంశీ షాకింగ్ లీక్ బయట పెట్టాడు. అండర్ వరల్డ్ నేపధ్యంలో ఉండే ఈ కథలో మహేష్ నెగిటివ్ టచ్ లో ఉండే డాన్ పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. ఇప్పటి వరకు మహేష్ తన కెరియర్ లో ఎప్పుడు నెగిటివ్ షేడ్ లో ఉండే పాత్రలో కనిపించక పోవడంతో మహేష్ కెరియర్ లో ఇది ఒక వెరైటీ ఫిలిం అవుతుందని అర్ధం వచ్చేలా వంశీ పైడిపల్లి లీకులు కనిపిస్తున్నాయి. 

‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ విడుదల తరువాత రెండు నెలల గ్యాప్ తీసుకుని మహేష్ తన మూవీ మొదలుపెట్టబోతున్నాడు అని వంశీ పైడిపల్లి ఇస్తున్న లీకులను బట్టి ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రారంభం కాబోతోంది అన్న క్లారిటీ వస్తోంది. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఈ మూవీని కూడ 2021 సంక్రాంతి రేస్ విడుదల చేసి మహేష్ తన సంక్రాంతి సెంటిమెంట్ ను కొనసాగించే ఆస్కారం ఉంది. వంశీ పైడిపల్లి ఇస్తున్న లీకులతో మహేష్ తో సినిమాలు చేయాలి అని ప్రయత్నిస్తున్న సందీప్ వంగ ప్రశాంత్ నీల్ మూవీలు ఇప్పట్లో లేవనే సంకేతాలు వస్తున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: