'మున్నామైఖెల్‌'తో హిందీ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది నిధి అగర్వాల్. ఆ సినిమా నుండి కేవలం నటన మాత్రమే కాకుండా అందాలతోను అదరగొడుతోంది నిధి. ఆ త‌ర్వాత అక్కినేని నాగ చైతన్య నటించిన 'సవ్యసాచి' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత అదే కాంపౌండ్ హీరో అఖిల్‌తో నటించింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. అయినప్పటికీ ఈ సినిమాల్లో నిధి నటన, గ్లామర్‌తో పూరీ జగన్నాథ్ కంట్లో పడింది. దీంతో పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రామ్ హీరోగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీలో నటించి సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా ద్వారా ఆమెకు మొదటి హిట్ వచ్చింది. ఈ సినిమా తర్వాత నిధి అగర్వాల్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది. 

 

ప్ర‌స్తుతం నిధి అగర్వాల్ టీచర్‌గా మారిపోయింది. విద్యార్థులకు పాఠాలు చెప్పి మెప్పించింది.  ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఇంగ్లిష్‌లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ‘పెగా టీచ్ ఫర్ చేంజ్’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గురువారం బంజారాహిల్స్ రోడ్డు నంబరు 12లోని ఎన్‌బీటీనగర్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన నటి నిధి మూడో తరగతి విద్యార్థులకు ఆంగ్ల పాఠాలు బోధించింది. దాదాపు గంటపాటు పాఠాలు చెప్పి మెప్పించింది. కార్యక్రమం అనంతరం నిధి మాట్లాడుతూ.. ఇలాంటి మంచి కార్యక్రమంలో తాను పాలుపంచుకోవడం ఆనందంగా ఉందని పేర్కొంది. 

 

ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న సంస్థను అభినందించింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ఇంగ్లిష్‌లో మాట్లాడేలా తీర్చిదిద్దేందుకు ప్రముఖులతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు పెగా సిస్టమ్స్ ఎండీ సుమన్‌రెడ్డి తెలిపారు. కాగా, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ మేనల్లుడు గల్లా అశోక్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా ఎంపికైంది. రొమాంటిక్ లవ్ బ్యాగ్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేయనున్నాడు.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: