దిశా హత్యోదంతం దేశమంతా సంచలనంగా మారింది. నేటి పరిస్థితుల్లో మహిళలు బయటకు రావాలంటేనే భయపడేలా దిశా హత్య జరిగింది. అయితే నిందితులకు ఉరి శిక్ష వేయాల్సిందే అంటూ అందరు డిమాండ్ చేశారు. ఈరోజు ఉదయం ఎక్కడైతే దిశాను నిందితులు నలుగురు హత్య చేసారో అక్కడే నలుగురిని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. 

 

 

సీపీ సజ్జనార్ నేతృత్వంలో నిందితులను ఎన్ కౌంటర్ చేయడం జరిగింది. సీన్ రీ కంస్ట్రక్షన్ లో భాగంగా ఘటనా స్థలంకి నిందితులను తీసుకు వెళ్లి ఆధారాలు సేకరిస్తుంటే నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. 

 

 

ఈ ఎన్ కౌంటర్ పై అందరు తమ స్పందన తెలియచేస్తున్నారు. సినీ హీరో  మంచు మనోజ్ నిందితుల ఎన్ కౌంటర్ పై స్పందించారు. ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది. ఆ తుపాకులకు దండం పెట్టాలని ఉంది. ఆ పోలీసుల కాళ్ళు మొక్కాలని ఉంది. నలుగురు చచ్చారు అనే వార్తలో ఇంత కిక్ ఉందా.. ఈరోజే నీ ఆత్మ దేవుడిని చేరింది చెల్లెమ్మా.. అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు మంచు మనోజ్. 

 

 

అంతేకాదు ఈ సంఘటన జరిగిన తర్వాత దిశా కుటుంబ సభ్యులను కూడా మనోజ్ కలవడం జరిగింది. సినీ హీరోగా కాదు సాటి మనిషిగా ఘటనపై మనోజ్ స్పందన అభినందననీయం. 

 

 

ఇక దిశా నిందితుల ఎన్ కౌంటర్ పై ఎన్టీఆర్ కూడా స్పందించారు. న్యాయం జరిగింది.. ఇప్పుడు రెస్ట్ ఇన్ పీస్ దిశా అని ట్వీట్ చేసారు ఎన్టీఆర్. సినీ ప్రముఖులే కాదు సాధారణ ప్రజలు కూడా పోలీసులకు అభినందనలు తెలుపుతున్నారు. దేశం అంతటా ఇప్పుడు ఇదే హాట్ న్యూస్ అయ్యింది. నిందితులకు ఇదే తగిన శిక్ష అని అందరు అంటున్నారు. మహిళా సంఘాలు కూడా నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: