టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎన్నో హిట్ సినిమాలు అందించిన వంశి పైడిపల్లి ఈ ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా ‘మహర్షి’ సినిమా తెరకెక్కించారు.  ఈ మూవీ రైతు గౌరవానికి సంబంధించింది కావడంతో అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఈ మూవీలో మహేష్ బాబు మూడు రకాల వేరియేషన్స్ లో కనిపించాడు.  కాలేజ్ విద్యార్థి, కోటీశ్వరుడిగా.. రైతు పోరాట యోధుడిగా మూడు రకాల పాత్రల్లో జీవిం పోశారు.  మ‌హేష్ బాబు, క్రియేటివ్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన మ‌హ‌ర్షి ఈ ఏడాది రెండు వందల కోట్ల క్లబ్ లో చేరింది.  

 

సామాజిక అంశాల‌ని జోడించి క‌మ‌ర్షియ‌ల్ నేప‌థ్యంలో మ‌హ‌ర్షి మూవీ తెర‌కెక్కించ‌గా, ఈ మూవీకి భారీ ఆద‌ర‌ణ ల‌భించింది.  ప్రస్తుతం మహేష్ బాబు కామెడీ డైరెక్టర్ అనీల్ రావిపూడితో ‘ సరిలేరు నీకెవ్వరు’ మూవీలో నటిస్తున్నారు.   ఈ మూవీ సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 11న విడుద‌ల కానుంది.   ఈ మూవీ తర్వాత వంశి పైడిపల్లితో మరో మూవీ ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.  దీనిపై వంశీ పైడిప‌ల్లి తాజాగా స్పందించారు. మ‌హేష్‌తో మ‌రో సినిమా చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించిన వంశీ పైడిప‌ల్లి ఈ మూవీ దిల్ రాజు నిర్మించ‌నున్న‌ట్టు పేర్కొన్నారు. 

 

ఈసారి కూడా కమర్షియల్ తో పాటు మంచి మెసేజ్ ఓరియెంటెడ్ ప్లాన్ చేయబోతున్నారట వంశి పైడిపల్లి.  అందుకోసం సరైన కథ ను సిద్దబ చేసే పనిలో ఉన్నారట.  ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి ప్ర‌స్తుతం లొకేష‌న్ వేట‌లో ఉన్నట్టు సమాచారం. గతంలో మహేష్ బాబు టైమ్ కోసం ఏకంగా రెండేళ్లు ఆగాల్సిన వచ్చిందని ఓ కార్యక్రమంలో స్వయంగా మహేష్ బాబే అన్నారు.  కానీ ఈ కాంబినేషన్ తెరపై కనిపించడానికి ఎక్కువ సమయం తీసుకోకపోవడం.. వంశిపై మహేష్ కి ఉన్న నమ్మకమే అని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: