రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు దేశవ్యాప్తంగా దిశ అత్యాచారం ఘటన సంచలనం సృష్టించింది. నవంబర్ 27 వ తారీఖున జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో సంచలనం అయ్యింది. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని దేశంలో ఉన్న చాలామంది రాజకీయ పార్టీల నేతలు మరియు అదే విధంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీలు నెటిజన్లు తీవ్రస్థాయిలో నిందితులపై విరుచుకుపడ్డారు. ఇలా ఘటన ఇతర దేశాల్లో జరిగి ఉంటే అప్పటికప్పుడే శిక్ష పడేది అని బహిరంగంగా ఉరి తీసే వాళ్లని ఇలా రకరకాలుగా దిశ అత్యాచార ఘటన నిందితులను ఉద్దేశించి వాళ్లను అరెస్టు చేసి జైల్లో పెట్టిన క్రమంలో సోషల్ మీడియాలో కామెంట్ రావడం జరిగింది.

 

ఇదిలా ఉండగా తాజాగా దిశ అత్యాచార ఘటన నిందితులను విచారణలో భాగంగా ఇటీవల పోలీసులు సంఘటన స్థలానికి తీసుకువెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా, పోలీసులపై వారు దాడి చేసి నలుగురు నిందితులు పారిపోయారు. పారిపోతున్న నిందితులపై పోలీసులు కాల్పులు జరపడంతో వారు అక్కడికక్కడే మరణించారు. దీంతో ఈ వార్త ఈరోజు తెల్లవారుజామున రావటంతో బ్రేకింగ్ న్యూస్ అయ్యింది చాలా మంది షాక్ తిన్నారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు తగిన న్యాయం జరిగిందని పోలీసుల చేతిలో దిశ అత్యాచార ఘటన నిందితులకు ఎన్‌కౌంటర్‌ జరగటం శుభపరిణామమని … రాబోయే రోజుల్లో ఇటువంటివి జరిగితే ప్రతి ఒక్కరికి ఈ విధంగానే శిక్ష పడాలని చాలామంది మహిళలు కోరుతున్నారు.

 

ఇదిలా ఉండగా తాజాగా సోషల్ మీడియాలో మంచు లక్ష్మి దిశ అత్యాచారం ఘటనపై మరియు ఎన్‌కౌంటర్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది….''నేను మరణశిక్షకు వ్యతిరేకిని. కానీ కొన్నేళ్లుగా నేను నా ఆలోచనా విధానాన్ని మార్చుకున్నా. రేపిస్టులను తప్పనిసరిగా ఉరి తీయాలి..మన జాతికి ఉదహరణగా నిలిచినందుకు, మహిళలపై గౌరవాన్ని చూపినందుకు కేటీఆర్ గారికి థాంక్యూ'' అంటూ రాసుకొచ్చింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: