మెగా మేనళ్లుడు సాయి తేజ్ హీరోగా మారుతి డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ప్రతిరోజు పండుగే. డిసెంబర్ 20న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానె ఉన్నాయి. ఈ ఇయర్ చిత్రలహరితో మంచి విజయాన్ని అందుకున్న సాయి తేజ్ మారుతి డైరక్షన్ లో మొదటిసారి చేసిన సినిమా ప్రతిరోజు పండుగే. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్ని వాసు నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ కామెంట్స్ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.

 

సాయి తేజ్ కి చిరంజీవిలో ఉండే బెస్ట్ క్వాలిటీ ఉంది. హీరోగా తను చేస్తున్న సినిమాల్లో కూడా వేరే వాళ్లకు స్పేస్ ఇస్తాడు. చిరు తర్వాత సాయి తేజ్ ఒక్కడే అలాంటి ఛాన్స్ ఇస్తాడు. మిగతా వారంతా అలా చేయరనేగా అంటూ మెగా ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. తన కొడుకు అల్లు అర్జున్ హీరోగా మంచి ఫాం లో ఉన్నాడు. అతను కూడా అవతల వారికి స్క్రీన్ స్పేస్ అంతగా ఇవ్వడన్నట్టే చెప్పాడన్నమాట.

 

మారుతి డైరక్షన్ లో వచ్చిన భలే భలే మగాడివోయ్ సినిమాతో హిట్ అందుకున్నాడు. మరోసారి ప్రతిరోజు పండుగే సినిమా కూడా ఇదే బ్యానర్ లో చేశాడు. గత కొన్నాళ్లుగా ఫ్లాపుల్లో ఉన్న సాయి తేజ్ కు కిశోర్ తిరుమల డైరక్షన్ లో చిత్రలహరి సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడు. ప్రతిరోజు పండుగే సినిమా కూడా సాయి తేజ్ కు హిట్ వచ్చేలా ఉంది. 

 

సాయి తేజ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన ప్రతిరోజు పండుగే సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతుంది. రాశి ఖన్నా ఆల్రెడీ మెగా హీరోతో సుప్రీం సినిమాలో నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ అవగా మళ్లీ అదే సెంటిమెంట్ రిపీట్ అయ్యేలా ఉంది. డిసెంబర్ 20న సాయి తేజ్ ప్రతిరోజు పండుగే సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు పోటీగా బాలకృష్ణ రూలర్ రిలీజ్ అవుతుంది. డిసెంబర్ 25న కూడా రాజ్ తరుణ్ ఇద్దరి లోకం ఒకటే సినిమా రిలీజ్ అవుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: