మెగా పవర్ స్టార్ రాం చరణ్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. సినిమాలో రాం చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. ఇదిలాఉంటే ఈ సినిమా తర్వాత చరణ్ ఎవరితో సినిమా చేస్తాడన్న విషయంపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్.టి.ఆర్ మాత్రం త్రివిక్రం తో సినిమా చేస్తాడని అంటున్నారు.

 

ఆల్రెడీ త్రివిక్రం తో లాస్ట్ ఇయర్ అరవిందసమేత సినిమా చేశాడు తారక్. ఆ సినిమా సక్సెస్ అవడంతో పాటుగా గురూజీతో సినిమా మంచి అనుభూతిని ఇచ్చింది. అందుకే ఆయనతో మరో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు ఎన్.టి.ఆర్. అయితే రాం చరణ్ మాత్రం తన నెక్స్ట్ సినిమా డైరక్టర్ విషయంలో కన్ ఫ్యూజన్ గా ఉన్నాడు. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎలాగు చరణ్ నేషనల్ వైడ్ రేంజ్ వస్తుంది.

 

అందుకే సినిమా తీస్తే భారీగానే తీయాలని అనుకుంటున్నాడు. వినయ విధేయ రామా లాగా ఫ్లాప్ కు ఛాన్స్ ఇవ్వకూడదని ఫీల్ అవుతున్నాడు. అందుకే చిరంజీవి సపోర్ట్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. చరణ్ నెక్స్ట్ సినిమా డైరక్టర్ గా చిరంజీవి ముగ్గురిని రిఫర్ చేసినట్టు తెలుస్తుంది. అందులో మొదటి దర్శకుడు అనీల్ రావిపుడి అని తెలుస్తుంది. పటాస్ నుండి ఎఫ్-2 వరకు సక్సెస్ లను అందుకున్న అనీల్ ప్రస్తుతం మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా హిట్టైతే ఇక అనీల్ క్రేజ్ డబుల్ అయ్యే అవకాశం ఉంది.

 

ఇక చరణ్ దర్శకుల లిస్ట్ లో అర్జున్ రెడ్డి డైరక్టర్ సందీప్ వంగ కూడా ఉన్నాడని తెలుస్తుంది. తెలుగులో అర్జున్ రెడ్డి హిందిలో కబీర్ సింగ్ గా సందీప్ వంగ సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. అందుకే అతని మీద చరణ్ ఫోకస్ పెట్టాడని తెలుస్తుంది. ఇక ధ్రువ లాంటి మరో క్రేజీ రీమేక్ కూడా సేఫ్ సైడ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నాడట. అయితే ఈసారి రీమేక్ కూడా మాత్రుక దర్శకుడితోనే చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తానికి చిరు సలహాల మేరకే చరణ్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత చేసేలా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: