టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో చాలముందు చూపు ఉన్న హీరోల లిస్టులో ఒకనాటి అందాల నటుడు  శోభన్ బాబు పేరు ఇప్పటికి చెపుతూ ఉంటారు. శోభన్ బాబు హీరోగా ఒక వెలుగువెలిగే రోజులలో ఆయన దగ్గరకు వచ్చే వారిని తమ సంపాదనను వ్యాపారాల పై కాకుండా భూముల పై పెట్టమని సలహాలు ఇచ్చేవారు అన్న వార్తలు అప్పట్లో తరుచూ వచ్చేవి. 

శోభన్ బాబు తన సంపాదనను వ్యాపారాల పై కాకుండా భూముల పై పెట్టడంతో ఇప్పుడు వాటి విలువ వేల కోట్లల్లో ఉంటుంది అని అంటారు. ఇప్పుడు ఈ విషయాలు గుర్తుకు వచ్చి పవన్ కళ్యాణ్ తన రాయలసీమ పర్యటనలో తన నిజాయితీని వివరిస్తూ చేసిన కామెంట్స్ చాలమందిని ఆశ్చర్య పరుస్తున్నాయి. 

పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న రోజులలో ‘జానీ’ సినిమాకు దర్శకత్వం వహించి తానే హీరోగా నటించాడు. ఆ సినిమాను అల్లు అరవింద్ నిర్మించాడు. అప్పట్లో పవన్ కు ఉన్న క్రేజ్ రీత్యా ఆ సినిమాలో నటించినందుకు పవన్ కళ్యాణ్ రెండు కోట్లు పారితోషికం తీసుకున్నాడట. అయితే ఆ మూవీ భయంకరమైన ఫ్లాప్ గా మారడంతో నష్టపోయిన ఆమూవీ నిర్మాతలను ఆదుకోవడానికి పవన్ తన పారితోషికాన్ని తిరిగి ఇచ్చి వేసాడట. 

అయితే తాను అలా చేయకుండా ఆడబ్బు పెట్టి తాను మాదాపూర్ ప్రాంతంలో కొన్ని ఎకరాలు కొనుక్కుని ఉంటే ఇప్పుడు తనకు వేల కోట్ల ఆస్థి విలువగా మారి ఉండేది అంటూ తన మంచితనం గురించి తన అభిమానులకు అర్ధం అయ్యేలా వివరించడానికి ప్రయత్నాలు చేసాడు. పవన్ కళ్యాణ్ నోటివెంట ఇలాంటి కామెంట్స్ రావడం పవన్ అభిమానులకు ఆనందం కలిగించే విషయం అయినప్పటికీ జరిగిపోయిన సంఘటనలను ఇప్పుడు గుర్తుకు చేసుకోవడం ద్వారా పవన్ కు కొత్తగా వచ్చే ఇమేజ్ ఏమిటో అర్ధం అవ్వక పవన్ అభిమానులు తికమక పడినట్లు టాక్.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: