దిశ అత్యాచారం హత్య చేసిన నలుగురు నిందితులను హైదరాబాద్ పోలీసులు ఎన్ కౌంటర్ చేయటంతో దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీసులపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఘటనకు పాల్పడిన నలుగురు నిందితులను పోలీసు విచారణలో భాగంగా సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తున్న సందర్భంలో సంఘటనా స్థలానికి తీసుకువెళ్లిన సందర్భంలో నలుగురు నిందితులు పారిపోవడానికి ప్రయత్నించగా వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యి  నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేయడం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున మూడు నాలుగు గంటల మధ్య ఎన్ కౌంటర్ జరగటంతో వార్త పొద్దుపొద్దున్నే రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు దేశవ్యాప్తంగా ఈ ఎన్ కౌంటర్ సంచలనం అయ్యింది.

 

దీంతో హైదరాబాద్ పోలీసులపై సర్వత్రా అనేకమంది సెలబ్రిటీల నుండి పార్టీల రాజకీయ నేతల నుండి ప్రశంసలు అందుతున్నాయి. చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో హైదరాబాద్ పోలీస్ రెండు ఉద్దేశించి ప్రశంసిస్తూ...దిశకు సరైన న్యాయం చేశారని కామెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 'నిందితులపై తగిన చర్య తీసుకున్న హైదరాబాద్ పోలీసులకు నా సెల్యూట్. ఈ దేశంలో ప్రతి మహిళ సురక్షితంగా జీవించే రోజు కోసం ఎదురుచూస్తున్నా' అని మురుగదాస్ ట్వీట్ చేశారు.

 

మరియు అదే విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి మరియు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇంకా చాలామంది సెలబ్రిటీలు జరిగిన ఎన్ కౌంటర్ నీ ఉద్దేశించి హర్షం వ్యక్తం చేస్తు ఇంకోసారి ఇటువంటి ఘటన చేయాలంటే సమాజంలో ఉన్న మగాళ్ల రూపంలో మృగాలు భయపడతాయి అంటూ పేర్కొంటున్నారు. మొత్తం మీద దేశ వ్యాప్తంగా ఇతర రాష్ట్రాలలో కూడా ఉన్న రేప్ కేసుల నిందితుల విషయంలో ఇలాంటి చర్య సదరు రాష్ట్రాలకు చెందిన పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: