హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ నీ నలుగురు కామాంధులు మగాళ్ల రూపంలో ఉన్న మృగాలు కలసి సామూహికంగా నవంబర్ 27 వ తారీఖున హైదరాబాద్ నగరం శివారు ప్రాంతం షాద్ నగర్ లో అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. ఈ ఘటన తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ ఘటనకు పాల్పడిన నిందితులను నలుగురిని 48 గంటలు గడవకముందే తెలంగాణ పోలీసులు పట్టుకొని న్యాయస్థానం ముందు నిలబెట్టడం జరిగింది. దీంతో చాలామంది సోషల్ మీడియా లో వివిధ పార్టీల రాజకీయ నాయకులు సెలబ్రిటీలు మరియు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు మొత్తం అందరూ ఆ నలుగురు మృగాలకు వెంటనే బహిరంగంగా ఉరి వేయాలి కాల్చి పారేయాలి మనుషుల మధ్య వాళ్ళు ఉండటానికి వీల్లేదు అంటూ తెగ గగ్గోలు పెడుతూ కామెంట్లు చేశారు.

 

ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు చట్ట ప్రకారం నలుగురు నిందితులకు శిక్షించడం జరుగుతుందని తెలపడంతో… అటువంటి నేరస్తులకు శిక్షలు సరిపోవని వెంటనే ఉరి వేయాలి లేదా వారిని అందరిని బయట పబ్లిక్ లో వదిలేయండి మేమే చంపేస్తాం అంటూ… అటువంటి నేరగాళ్లను మృగాలను జైల్లో పెట్టి మేపడం కంటే భూమ్మీద లేకుండా చేయడమే బెటర్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేయడం జరిగింది. కాగా విచారణ నిమిత్తం ఊహించని విధంగా నేడు(శుక్రవారం తెల్లవారుజామున) పోలీసులు నిందితులని ఎన్ కౌంటర్ చేశారు. పోలిసుల కాల్పుల్లో నలుగురు నిందితులు మరణించారు. పోలీసులు చర్యపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.

 

సెలెబ్రిటీలంతా హైదరాబాద్ పోలీసులని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. దిశకు సరైన న్యాయం జరిగిందని అంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో టాలీవుడ్ హీరోయిన్ ఛార్మి వీడియో రూపంలో జరిగిన ఎన్కౌంటర్ ఉద్దేశించి షాకింగ్ కామెంట్ చేసింది. ఇటువంటి ఘటన మరొకసారి జరగకుండా హైదరాబాద్ పోలీసులు సరైన రీతిలో బుద్ధి చెప్పారని… ఇలాంటి వ్యక్తులు రేప్ చేసే ముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళు గుర్తుకు రారేమో… కానీ ఎప్పటి నుండి పోలీసులు గుర్తుకు వస్తారు అని నిజమైన దీపావళి అసలైన దీపావళి అంటే ఇదే అని వీడియో రూపంలో పోలీసులపై ప్రశంసల వర్షం ఛార్మి కురిపించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: