ప్రస్తుతం దేశవ్యాప్తంగా మరియు రెండు తెలుగు రాష్ట్రాలలో దిశ' పై హత్యాచారానికి పాల్పడిన నలుగురు నిందితుల ఎన్ కౌంటర్ గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతుంటే మరోపక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసుకుని శ్రీ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. సోషల్ మీడియాలో ఈ విధంగా పోస్టు పెట్టింది. నలుగురు కామాంధులను చంపేసిన ఎన్ కౌంటర్ చేసిన తెలంగాణ పోలీసులకు హ్యాట్సాఫ్ అండ్ ఇటువంటి మరణాలు తనకు ఎంతగానో సంతోషాన్ని ఇస్తాయి అని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.

 

ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కి లింక్ చేస్తూ సంచలన కామెంట్ చేసింది. విషయంలోకి వెళితే పవన్ కళ్యాణ్ లాగా మూడు నాలుగు పెళ్ళిళ్ళు సమాజంలో చేసుకుంటాన వారిని కూడా ఎన్ కౌంటర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ పోలీసులకు రిక్వెస్ట్ చేస్తున్నట్లు సోషల్ మీడియా పేజీలో కామెంట్ చేసింది.

 

అంతేకాకుండా జనసేన పార్టీ తొందరలో బిజెపి పార్టీలో విలీనం కాబోతునట్లు వస్తున్న వార్తలను ఉద్దేశించి శ్రీ రెడ్డి తనకి బిజెపి పార్టీ అంటే ప్రేమ అంటూ పవన్ కళ్యాణ్ ని కాదని తెలిపింది. దీంతో శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు. గతంలో క్యాస్టింగ్ కౌచ్ అంటూ ఫిలిం ఛాంబర్ ముందు బట్టలు విప్పేసి నిరసన తెలిపి తర్వాత మెగా కుటుంబంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హైదరాబాద్ నుండి చెన్నైకి మకాం మార్చి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన శ్రీ రెడ్డి ఇటీవల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వ్యవహరిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులు….శ్రీ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్లు చాలా ఘాటుగా దారుణంగా రిప్లై ఇస్తున్నారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో దిశ ఎన్ కౌంటర్ టాపిక్ తో పాటు పవన్ కళ్యాణ్- శ్రీరెడ్డి వ్యవహారం వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: