ప్రస్తుతం టాలీవుడ్ లో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా అంటే ఖచ్చితంగా సరిలేరు నీకెవ్వరు సినిమా ఉంటుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాతో అలనాటి అందాల తార విజయశాంతి కూడా మళ్లీ తెరపై కనిపించబోతున్నారు. ఈ సినిమాని అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈయనకి ఇప్పటికే వరుసగా నాలుగు చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానున్నది.

 

 కాబట్టి నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో ప్రమోషన్స్ చాలా ఊపు మీద ఉన్నాయి . ఈ సినిమా టీజర్ అలాగే మొదటి పాటను కూడా యూట్యూబ్ లో విడుదల చేసి అవి రెండూ కూడా మంచి సంచలనం సృష్టించాయి. ఇదంతా ఒక పక్క జరుగుతుంటే మరోవైపు ఈ సినిమా బడ్జెట్ విషయంలో అస్సలు కంట్రోల్ లేదని తెలుస్తుంది. దర్శకుడుగా మంచి ఊపు మీద ఉన్న అనిల్ రావిపూడి ఈ సినిమా కోసం ఎనిమిది కోట్ల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

అలాగే మహేష్ బాబు తో పాటు ఇతర నటీనటులు పారితోషికం అన్నీ కలిపి దాదాపు 60 కోట్లు ఖర్చయిందట. సినిమా కోసం దాదాపు 30 కోట్లు ఖర్చు పెట్టారట. దీంతో సినిమా బడ్జెట్ మొత్తం వంద కోట్ల మార్క్ ని టచ్ అయింది అని తెలిసింది. ఈ సినిమా మొత్తం దాదాపు హాస్యభరితంగా సాగుతుందని అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ దర్శకుడు గత నాలుగు చిత్రాలు కూడా కామెడీ చాలా అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. వెంకీ సినిమాలో ట్రైన్స్ సీన్ ఎంత బాగా హిట్ అయిందో అంతకంటే ఈ సినిమాలోని ట్రైన్ సీన్ ఇంకా బాగుంటుందని దర్శకుడు చెప్పాడు.

 

 ఈ సినిమా బిజినెస్ కూడా 100 కోట్ల పైగా జరిగిందని తెలుస్తోంది. కాగా ఈ సినిమాకి చిత్రానికి మహేష్ బాబు రెమ్యూనరేషన్ కాకుండా ఏరియా రైట్స్ కోసం అడిగారని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి మహేష్ బాబు ఎన్నో హిట్టు మ్యూజిక్ ఆల్బమ్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: