నిర్మాతగా రాణించాలని భావించి నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన యువ హీరో రామ్ చరణ్ కి సైరా సినిమా షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు వసూళ్లు 80 కోట్లు కూడా రాకపోవడంతో ఇప్పుడు సినిమాల నిర్మాణాలకు మెగా పవర్ స్టార్ దూరంగా ఉన్నాడట. ఇప్పుడు ఎవరైనా కథతో వచ్చినా సరే తనకు ఆసక్తి లేదని చెప్పాడట. ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ అనే సినిమాలో రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇక ఇదే సమయంలో ఒక దర్శకుడు పవన్ కళ్యాణ్ తో సినిమా చేద్దామని తన వద్దకు వచ్చారట.

 

వరుసగా మూడు సినిమాలు హిట్ అయిన దర్శకుడు అయినా సరే రామ్ చరణ్ ఆసక్తి చూపించలేదట. దానికి కారణం ఏంటి అనేది కూడా చెప్పినట్టు సమాచారం. గతంలో తన బాబాయి... నాగబాబు... చెర్రీతో ఆరెంజ్ సినిమా చేసారు. ఈ సినిమా ఊహించని విధంగా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత కుటుంబంలో కూడా విభేదాలు వచ్చాయి. దాదాపు మూడేళ్ళ పాటు వాళ్ళ మధ్య మాటలు కూడా లేవు. చిరంజీవి తనను కనీసం ఆదుకోలేదని నాగబాబు అసహనం వ్యక్తం చేసారట. ఇక అప్పుడు రామ్ చరణ్ కూడా కాస్త ఇబ్బంది పడ్డారట.

 

ఇప్పుడు మళ్ళీ కుటుంబంలో సినిమా చేస్తే... ఇబ్బందులు వద్దని, ఆ సినిమా ఫ్లాప్ అయితే జరిగే ప్రచారాలు తనను ఇబ్బంది పెడతాయని... ఇక తన బాబాయి సినిమా హిట్ అవుతుందో లేదో నమ్మకం లేదని... ఇప్పుడు నేను రిస్క్ చేయలేను అనే విషయాన్ని చెప్పాడట రామ్ చరణ్. దీనితో ఆ దర్శకుడు దిల్ రాజు వద్దకు వెళ్లినట్టు సమాచారం. పెట్టుబడులు పెట్టి ఆ తర్వాత మాటలు పడటం... తనకు నిర్మాణ రంగం అంతగా కలిసి రాలేదని... ఇప్పుడే కుటుంబ సంబంధాలు మళ్ళీ బలపడుతున్నాయని ఈ సమయంలో అనవసర ప్రయత్నాలకు తను వెళ్ళేది లేదని చెప్పాడట. 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: