సినీ పరిశ్రమలో కొన్ని సార్లు చాలా విచిత్రాలు జరుగుతుంటాయి.  బ్లాక్ బస్టర్ అయిన మూవీహీరో చేయాల్సి ఉంటుంది..బ్యాడ్ లక్ తో మూవీ పక్కన బెట్టడం..తర్వాత తెగ బాధపడిపోవడం చూస్తుంటాం.  కొన్ని సార్లు అట్టర్ ఫ్లాప్ మూవీలో తాను నటించకుండా ఎస్కేప్ కావడం.. తెగ సంతోషాన్ని ఇస్తుంది.  ఇలాంటి పరిస్థితులు హీరోయిన్లకు కూడా అప్పుడప్పుడు ఎదురవుతుంటాయి.  ఈ నేపథ్యంలో ‘ఊహలు గుసగుసలాడే’ మూవీ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయిన నటి రాశీఖన్నా తర్వాత తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటిస్తుంది.  తాజాగా ఈ అమ్మడు బాబీ దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, నాగ చైతన్య మల్టీస్టారర్ మూవీ ‘వెంకిమామ’ లో చైతూ సరసన నటిస్తుంది.

 

వాస్తవానికి ఈ మూవీలో మొదట రకూల్ ప్రీత్ సింగ్ ని అనుకున్నారట. అప్పటికీ రారండోయ్ వేడుక చూద్దాం మూవీలో ఈ జంట నిటించారు.  కాకపోతే సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు.  కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల రకూల్ స్థానంలో రాశీఖన్నా ని తీసుకున్నారట చిత్రయూనిట్.  ఇక వెంకిమామ త్వరలో రిలీజ్ అవుతున్న సందర్భంగా ఈ మూవీ ప్రమోషన్ ఊపందుకున్నాయి.  ఈ సందర్భంగా నటి రాశీఖన్నా చిత్ర విశేషాల గురించి మాట్లాడారు.  ఈ సినిమాలో నా పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. వెంకీ సర్ లాంటి సీనియర్ హీరోతో నటించే అవకాశం వచ్చింది. ఈ అవకాశం ముందుగా రకుల్‌కు వచ్చింది.

 

ఆమెకు డేట్లు అడ్జెస్ట్ కాకపోవడంతో నేను చేశాను. అంతే కాదు ఈ మూవీలో నటిస్తున్నపుడు వెంకటేష్ గారి నుంచి ఎంతో క్రమశిక్షణ నేర్చకున్నానని చెప్పింది.  అంతేకాదు ఆయన సెట్స్ లో ఉంటే  చాలా ఫన్నీగా ఉత్సాహంగా ఉంటారని అన్నారు. అయితే ఈ మూవీలో మొదట రకూల్ కి ఛాన్స్ వచ్చింది... కానీ ఆమె డేట్లు అడ్జెస్ట్ కాకపోవడంతో నేను చేశాను. ఆమె నాకు బెస్ట్ ఫ్రెండ్ అని రాశి చెప్పింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: