సినిమాల్లో ఎప్పుడు ఏ కాంబినేషన్ సెట్ అవుతుందో చెప్పలేం. కథానుసారం, క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ను బట్టి ఒక్కోసారి క్రేజీ కాంబినేషన్ సెట్ కావొచ్చు. హీరో, హీరోయిన్లు, హీరో, దర్శకుడి కాంబోలు ఎలాంటి క్రేజ్ క్రియేట్ చేస్తాయో తెలిసిందే. అదే.. ఇద్దరు సూపర్ స్టార్స్, నువ్వా నేనా అన్నట్టు దాదాపు 40 ఏళ్లుగా పోటీపడ్డ హీరోలు ఒకే సినిమాలో కలిసి చేస్తే..! అటువంటి మల్టీస్టారర్ ను మనం ఊహించగలమా? కానీ ఇది జరుగబోతోందని చెన్నై మీడియా కోడై కూస్తోంది.

 

 

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఇద్దరూ సమకాలీకులే. ఇంకా చెప్పాలంటే వీరిద్దరిలో కమలే సీనియర్. అయినా వీరిద్దరూ తమ తమ సినిమాలతో ఎవర్ గ్రీన్ స్టార్ డమ్ సంపాదించుకున్నవారే. వీరిద్దరూ కెరీర్ ప్రారంభంలో కలిసి సినిమాలు చేసారు. తర్వాత మరెప్పుడూ చేయలేదు. కారణం స్టార్ డమ్.. సరైన కథ లేకపోవడమే. ఇన్నేళ్ల తర్వాత రజినీ – కమల్ ఇద్దరూ కలిసి ఓ మల్టీస్టారర్ కథ చేయనున్నారని కోలీవుడ్ సమాచారం. ఇటివల సూపర్ హిట్ అయిన కార్తీ ఖైదీ సినిమా విజయంపై దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ను రజినీ అభినందించాడట. దీంతో రజినీకి థ్యాంక్స్ చెప్తూనే ఓ కథ కూడా వినిపించాడట. కథానుసారం ఈ కథలో హీరోతో సమానమైన క్యారెక్టర్ ఉందని తమిళనాడు వార్త.

 

 

రజినీ – కమల్ సినిమాను కమల్ హాసనే స్వయంగా తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై నిర్మిస్తాడని కూడా వార్తలు వస్తున్నాయి. సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో కమల్ హాసన్ నటిస్తాడని కూడా అంటున్నారు. అయితే.. ప్రస్తుతానికి ఈ వార్తలో ఎలాంటి క్లారిటీ లేకపోయినా లోకేశ్ కనగరాజ్ మాత్రం రజినీకి కథ చెప్పాడనే వార్త నిజమని అంటున్నాయి చెన్నై సినీ వర్గాలు. ఈ వార్తపై అఫిషియల్ కన్ఫర్మేషన్ రావాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: